
భూ తగాదాలో అన్నను చంపిన తమ్ముడు
పెగడపల్లి(ధర్మపురి): భూతగాదాలో సొంత అన్నను తమ్ముడు హతమార్చిన ఘటన జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం అయితిపల్లి గ్రామంలో జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన కూన నర్సయ్య (50), కూన రాములు అన్నదమ్ములు. మద్యానికి బానిసయ్యారు. ఇద్దరి బాధలు భరించలేక ఇరువురి భార్యలు వీరిని వదిలి దూరంగా ఉంటున్నారు. ఒకే ఇంట్లో నివాసం ఉంటున్న అన్నదమ్ముల మధ్య కొంతకాలం నుంచి భూవివాదం నెలకొంది. ఈక్రమంలో గ్రామంలో జరిగిన పెద్దమ్మ బోనాల పండుగ సందర్భంగా గు రువారం రాత్రి ఇద్దరూ అతిగా మద్యం తాగారు. తాగిన మైకంలో గతంలో జరిగిన గొడవలను గుర్తు చేసుకుంటూ ఒకరినొకరు దూషించుకున్నారు. ఈ క్రమంలో ఆవేశానికి గురైన రాములు కర్రతో నర్స య్య తలపై బాదడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య రాజవ్వ ఫిర్యాదు మేరకు రాములుపై హత్యా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో రవీందర్ పేర్కొన్నారు. మల్యాల సీఐ రవి సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. కాగా నిందితుడు స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం.

భూ తగాదాలో అన్నను చంపిన తమ్ముడు