
గేదె కోసం వెళ్తే ప్రాణం పోయింది
యైటింక్లయిన్కాలనీ(రామగుండం): గోదావరిఖని టూటౌన్ పోలీస్స్టేషన్ పరిధి అల్లూరు గగ్గిరెద్దులవాడలో నివాసం ఉంటున్న ఆవుల కొమురయ్య(50) శుక్రవారం గ్రామశివారులోని చెరువులో మునిగి మృతి చెందాడు. పోలీసులు కథనం ప్రకారం.. రోజులాగా చెరవు సమీపానికి పశువులను మేతకోసం తరలించాడు. పశువులు చెరువులోకి వెళ్లడంతో బయటకు పంపించేందుకు అతడూ చెరువులోకి దిగాడు. ప్రమాదవశాత్తు నీటమునిగి చనిపోయాడు. మరోపశువుల కాపరి నర్సయ్య స్థానికుడు పోచంకు విషయం చెప్పాడు. ఆయన ఇచ్చిన సమాచారంతో కుటుంబసభ్యులు చెరువు వద్దకు చేరుకుని గాలించారు. కొమురయ్యను బయటకు తీయగా అప్పటికే మృతి చెందాడు. మృతుడి రెండో కుమారుడు రాజయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు ఎస్సై హైమదుల్లా తెలిపారు. మృతుడికి భార్య, నలుగురు కుమారులు ఉన్నారు.
చెరువులో మునిగి కాపరి మృతి