
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
గంభీరావుపేట(సిరిసిల్ల): మండలంలోని దమ్మన్నపేటకు చెందిన వీరవేని భూమలింగం(50) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఎస్సై ప్రేమానందం, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు. భూమలింగం గురువారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లాడు. రాత్రి వరకు ఇంటికి రాకపోయేసరికి కుటుంబసభ్యులు ఎంత వెదికినా ఆచూకీ లభించలేదు. భూమలింగం మృతదేహాన్ని శుక్రవారం తెల్లవారుజామున జగదాంబతండాలో స్థానికులు గమనించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. భూమలింగం ఇటీవల మద్యానికి బానిసైనట్లు, మద్యం మత్తులో కిందపడి మృతి చెంది ఉంటాడని బంధువులు పేర్కొన్నారు. మృతుడి బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.