
దుబాయిలో బతికపల్లి వాసి ఆత్మహత్య
పెగడపల్లి(ధర్మపురి): ఉపాధి కోసం దుబాయి వెళ్లిన పెగడపల్లి మండలం బతికపల్లి గ్రామానికి చెందిన పూడూరి లచ్చన్న (46) ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. స్థానికంగా ఉపాధి లేక జీవనో పాధి నిమిత్తం మూడేళ్ల క్రితం లచ్చన్న దుబాయి వెళ్లాడు. అక్కడ సరైన పని లభించక కుటుంబాన్ని పోషించడం భారంగా మారింది. దీంతో జీవితంపై విరక్తి చెందిన లచ్చన్న తాను ఉంటున్న గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులకు గురువారం సమాచారం అందింది. ఐదు నెలల క్రితం తండ్రి మరణిస్తే స్వగ్రామానికి వచ్చి తిరిగి దుబాయి వెళ్లిన లచ్చన్న ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా రోదిస్తున్నారు. మృతుడికి భార్య లత, ఇద్దరు కుమారులు న్నారు. కాగా లచ్చన్న మృతదేహం త్వరగా స్వగ్రామానికి వచ్చేలా చూడాలని మంత్రి లక్ష్మణ్కుమార్, ప్రభుత్వాన్ని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.