
మొబైల్ చూస్తున్నావని మందలించినందుకు..
రామగిరి(మంథని): నిత్యం మొబైల్ చూ స్తున్నావని తండ్రి మందలించినందుకు మనస్తాపం చెందిన లెక్కల శివశంకర్ (17) పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కథనం ప్రకారం.. రత్నాపూర్ పంచాయతీ పరిధి లక్ష్మీనగర్ ఫ్లాట్లలో నివాసం ఉండే శివశంకర్.. మొబైల్ ఫోన్లో తరచూ చాటింగ్ చేస్తున్నాడు. అలా చేయొద్దని తండ్రి వెంకన్న మందలించాడు. దీంతో ఈనెల 4న శివశంకర్ పురుగుల మందు తాగాడు. తల్లిదండ్రులు వెంటనే ఆస్పత్రికి తరలించగా వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందాడు. శుక్రవారం ఇంటికి తీసుకొని వస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుడి తల్లి రమాదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు ఎస్సై చంద్రకుమార్ తెలిపారు.