
రైలు ప్రమాదంలో మహిళ..
రామగుండం: అంతర్గాం మండలం పెద్దంపేట రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్సు రైలు కిందనుంచి దాటే క్రమంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. జీఆర్పీ ఔట్పోస్టు ఇన్చార్జి తిరుపతి కథనం ప్రకారం.. పెద్దంపేట కు చెందిన కొలిపాక రాజమణి(57) ఉరఫ్ మణెమ్మ పెద్దంపేట రైల్వేస్టేషన్ అవతలి వైపు ఉన్న పత్తి చేనులో కూలీ పనులకు వెళ్లింది. పనులు ముగించుకొని ఇంటికి వస్తున్న క్రమంలో మైడో రైల్వేట్రాక్పై మూడురోజులుగా గూడ్సు రైలు ఆగి ఉంది. దాని కిందనుంచి దాటే క్రమంలో రైలు ఒక్కసారి కదిలింది. ఈ ఘటనలో ఆమె పై రైలు వెళ్లడంతో తల, మొండెం తెగిపో యాయి. మృతురాలికి ముగ్గురు కూతుళ్లు ఉ న్నారు. వారందరికీ వివాహాలయ్యాయి. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు జీఆర్పీ ఔట్పోస్ట్ ఇన్చార్జి పేర్కొన్నారు.