
చికిత్స పొందుతూ వ్యక్తి..
ఇల్లంతకుంట(మానకొండూర్): కుటుంబ కలహాలతో గురువారం గడ్డి మందు తాగిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మరణించాడు. ఎస్సై అశోక్ తెలిపిన వివరాలు. మండలంలోని జంగారెడ్డిపల్లికి చెందిన పండుగ చక్రపాణి(43) కొంతకాలంగా తన భార్య, తల్లితో విభేదాలు ఏర్పడ్డాయి. గ్రామపెద్దల సమక్షంలో అనేకసార్లు పంచాయితీలు జరిగాయి. దీంతో కలత చెందిన చక్రపాణి గురువారం గడ్డి మందు తాగాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతుని అన్న అశోక్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య, కూతురు ఉన్నారు.