జపాన్‌ సకురా సైన్స్‌ హైస్కూల్‌కు శుభశ్రీ | - | Sakshi
Sakshi News home page

జపాన్‌ సకురా సైన్స్‌ హైస్కూల్‌కు శుభశ్రీ

Jun 14 2025 9:52 AM | Updated on Jun 14 2025 10:30 AM

జపాన్‌ సకురా సైన్స్‌ హైస్కూల్‌కు శుభశ్రీ

జపాన్‌ సకురా సైన్స్‌ హైస్కూల్‌కు శుభశ్రీ

సప్తగిరికాలనీ(కరీంనగర్‌): పట్టుదల ఉంటే సాధ్యం కానిది ఏం లేదనడానికి నిదర్శనం కరీంనగర్‌కు చెందిన శుభశ్రీ సాహు. అగ్రికల్చర్‌ మిషన్‌ను తయారు చేసిన శుభశ్రీ ఇన్‌స్పైర్‌ మనక్‌ అవార్డు ప్రదర్శనలో భాగంగా ఈ నెల 15నుంచి 21వరకు జపాన్‌ దేశంలోని జపాన్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఏజెన్సీ నిర్వహించనున్న సకురా సైన్స్‌ ఎక్చేంజ్‌ ప్రోగ్రాంలో పాల్గొననుంది. కరీంనగర్‌ మంకమ్మతోటకు చెందిన శుభశ్రీ సాహు స్థానిక పారమిత పాఠశాలలో చదివింది. ప్రస్తుతం సీబీ ఎస్‌ఈ 12వ తరగతి చదువుతోంది. 9వ తరగతి చదువుతున్న సమయంలో ఇన్‌స్పైర్‌ మనక్‌కు ఎంపికై ంది. జిల్లాస్థాయిలో తాను చేసిన ప్రదర్శన అంచెలంచెలుగా అందరి ప్రశంసలు పొంది నేడు జపాన్‌ సకూర స్కూల్‌కు ఎంపికై ంది. లలిత్‌మోహన్‌ సాహు శుభశ్రీకి తండ్రి, గై డ్‌ టీచర్‌. తల్లి సుగ్యని సాహు. ఇద్దరు పా రమిత పాఠశాల ఉపాధ్యాయులే. సొంతూరు ఒ డిశా రాష్ట్రం కాగా కరీంనగర్‌లో సుమారు 25ఏళ్లుగా నివాసముంటున్నారు.

తెలంగాణ నుంచి ముగ్గురు

శుభశ్రీ పోర్టబుల్‌ వ్యవసాయ యంత్రాన్ని తయారు చేసింది. ధాన్యం మార్పిడి, వేరు చేయడం, గడ్డికోత, తూర్పార, సంచులను కుట్టడం వంటి నాలుగు వేర్వేరు ప్రక్రియలు ఈ యంత్రం చేస్తుంది. ఈ యంత్రాన్ని సౌరశక్తి ద్వారా నడిపించొచ్చు. 2022–23 విద్యాసంవత్సరంలో తొలిసారిగా జిల్లాస్థాయి ఇన్‌స్పైర్‌ ప్రదర్శనలో శుభశ్రీ సాహు పాల్గొంది. 2024లో హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి ప్రదర్శనలో రాణించి జాతీయస్థాయికి ఎంపికై ంది. 2024 సెప్టెంబర్‌లో ఢిల్లీలో జరిగిన జాతీయస్థాయి ఇన్‌స్పైర్‌ అవార్డు ప్రదర్శనలో పాల్గొని టాప్‌ 30లో నిలిచింది. 2025–26 సంవత్సరానికిగాను డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, న్యూ ఢిల్లీ, జపాన్‌ దేశంలోని సకురా సైన్స్‌ హైస్కూల్‌ ప్రోగ్రామ్‌ కోసం దేశవ్యాప్తంగా 54మంది విద్యార్థులను శుక్రవారం ఎంపిక చేయగా తెలంగాణ నుంచి ము గ్గురు విద్యార్థులు ఎంపికయ్యారు. ఇందులో శుభశ్రీ కూడా చోటు సంపాదించింది. జపాన్‌లో జూన్‌ 15నుంచి 21 వరకు ఏడు రోజుల పాటు వీరు పర్యటిస్తారు. జపాన్‌ ఏరోస్పేస్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ ఏజెన్సీ, అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలను సందర్శిస్తారు. ఈ కార్యక్రమానికి పూర్తిగా విద్యార్థి ఖర్చులను భారత ప్రభుత్వమే భరిస్తుంది.

భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 15నుంచి 21వరకు పర్యటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement