
మిడ్మానేరు ప్రాజెక్టు పరిశీలన
● జిల్లాలో ముగిసిన కేంద్రబృందం పర్యటన
బోయినపల్లి(చొప్పదండి): మిడ్ మానేర్ ప్రాజెక్టును కేంద్ర బృందం అధికారులు గురువారం పరిశీలించారు. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ జాయింట్ సెక్రటరీ సెంతల్ రాజన్ ఆధ్వర్యంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సైంటిస్ట్ సుధీర్ కుమార్, కృష్ణా, గోదావరి బేసిన్ ఆర్గనైజషన్ ఈఈ ధీరజ్ సింఘాల్ పరిశీలించారు. వరదకాలువ నిర్మాణంలో కేంద్ర నిధుల వినియోగంపై తెలుసుకున్నారు. ప్రాజెక్టు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు నీటి ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో వివరాలు.. ప్రాజెక్టు నుంచి ఏయే ప్రాంతాలకు నీళ్లు తరలిస్తారనే విషయం తెలుసుకున్నారు. ప్రాజెక్టు కింద ఆయకట్టు వివరాలు తెలుసుకున్నారు. ప్రాజెక్టు ఈఈ జగన్, డీఈలు రాజు, శ్రీనివాస్, ఏఈలు రాధిక, అనుపమ, వర్క్ ఇన్స్పెక్టర్ రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
మూడు పంటలు పండుతున్నాయి
– కేంద్ర బృందం అధికారులతో వరదకాల్వ రైతులు
ఇల్లంతకుంట(మానకొండూర్): వరదకాల్వ పూర్తయిన తర్వాత మూడు పంటలు పండిస్తున్నామని మండలంలోని గాలిపల్లి రైతులు కేంద్ర బృందం అధికారులకు తెలిపారు. రెండు రోజులుగా జిల్లాలో పర్యటిస్తున్న కేంద్ర బృందం అధికారులు గురువారం మండలంలోని పొత్తూరు మానేరువాగుపై నిర్మించిన మిడ్మానేరు కుడికాలువ దాని డిస్ట్రిబ్యూటరీ కాలువలను గురువారం పరిశీలించారు. గాలిపల్లిలో డిస్ట్రిబ్యూటరీ–4 వద్ద రైతుల నుంచి పంటల సాగు వివరాలు తెలుసుకున్నారు. జిల్లాలో పర్యటన ముగిసిందని, సిద్దిపేట జిల్లాలోని రంగనాయకసాగర్ ప్రాజెక్టు పరిశీలించనున్నట్లు తెలిపారు. సీడబ్ల్యూసీ ఈఈ ధీరజ్సింగాల్, గ్రౌండ్ వాటర్బోర్డ్ సైంటిస్ట్ ఎం.సుధీర్కుమార్, జిల్లా ఇరిగేషన్ డీఈ శ్రీనివాస్, ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ జగన్, డిప్యూటీ ఇంజినీర్లు శ్రీనివాస్, అంజయ్య, రాజు, సెస్ డైరెక్టర్ రవీందర్రెడ్డి, రైతులు పాల్గొన్నారు.