
రైతులకు గిట్టుబాటు ధరే లక్ష్యం
కరీంనగర్ అర్బన్: రైతులు పండించిన విత్తన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ అన్వేశ్ రెడ్డి అన్నారు. నూతన విత్తన చట్టం ముసాయిదాను రూపొందించడంలో భాగంగా గురువారం అభిప్రాయ సేకరణ నిర్వహించారు. స్థానిక కేడీసీసీబీ కాన్ఫరెన్స్ హాల్లో విత్తన కంపనీ, విత్తన ఆర్గనైజర్లు, విత్తన డీలర్లు, రైతులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులతో చర్చించారు. ప్రభుత్వం విత్తనోత్పత్తి చేస్తున్న రైతులు నష్టపోకుండా ముసాయిదా విత్తన చట్టం రూపొందిస్తోందని వివరించారు. ప్రస్తుత చట్టంలోని శిక్షలను పెంచుతూ ఉత్పత్తిదారులు, ఆర్గనైజర్లకు వర్తింపజేయాలని రైతులు అభిప్రాయపడ్డారు. కమిటీ సభ్యులు డి.నర్సింహరెడ్డి, కమిషనరేట్ ప్రతినిధి పుష్పరాణి, వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు ఉషారాణి, శ్రావణి, విజయభాస్కర్, మధుకర్, కేవీకే శాస్త్రవేత్త విజయ్, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, ఏడీఏలు, ఏవోలు, రైతులు, ఉత్పత్తిదారులు, ఆర్గనైజర్లు, డీలర్లు పాల్గొన్నారు.
రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ అన్వేశ్రెడ్డి