పోదాం పదా బడికి | - | Sakshi
Sakshi News home page

పోదాం పదా బడికి

Jun 12 2025 3:07 AM | Updated on Jun 12 2025 3:07 AM

పోదాం

పోదాం పదా బడికి

ఇవి కీలకం

పెన్నులు, పెన్సిళ్లు, స్కేళ్లు, రబ్బర్లు.. చూడటానికి చిన్నవే అన్నట్లు కనిపిస్తా యి. కానీ, వీటి అవసరం మాత్రం పెద్ద ది. వీటిపై తల్లిదండ్రులు దృష్టి పెట్టి బ్యాగులో ఉంచాలి. సెలవులు దొరికాక చాలా మంది పిల్లలు ఆటపాటలకే పరి మితయ్యారు. ఉన్నత తరగతికి వెళ్తున్నా రు కదా అని సరిపెట్టుకోకుండా పాత పుస్తకాల్లోని అంశాలను పిల్లల చేత ఒకసారి పునశ్చరణ చేయించండి.

పాత పుస్తకాలైనా పర్వాలేదు

ప్రభుత్వ స్కూళ్లకు సరఫరా చేసే పాఠ్య పుస్తకాలన్నింటినీ మండల విద్యావనరుల కేంద్రానికి మరో వారం రోజుల్లో చేరవేయనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి చెబు తున్నారు. ఇక ప్రైవేట్‌ విద్యార్థులు మార్కెట్లో అన్నిరకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయా లేదా అని ఆలోచించకండి. మీ ఇంటి పరి సరాల్లోని పిల్లల నుంచి పాత పుస్తకాలు సమకూర్చుకోండి. అవసరమైతే కొత్తవి దొరికినప్పుడు కావా లంటే మళ్లీ కొనుగోలు చేయొచ్చు.

ముగిసిన వేసవి సెలవులు నేటి నుంచి మోగనున్న బడిగంట

పిల్లలూ.. సిద్ధంకండి ఇలా.. తల్లిదండ్రులపై ‘గురు’తర బాధ్యత

కరీంనగర్‌: వేసవి సెలవులు ముగిశాయి. గురువారం బడిగంట మోగనుంది. పిల్లల్ని బడిబాట పట్టించేందుకు తల్లిదండ్రులు ఇప్పటికే మానసికంగా సంసిద్ధులయ్యారు. ఈనేపథ్యంలో పిల్లలకు అవసరమైన వస్తువులు అన్ని ఉన్నాయా? లేదా ? అని ఎవరూ చూడరు. పిల్లలను బడికి సిద్ధం చేయడంలో తల్లిదండ్రులపై ఉన్న గురుతర బాధ్యతపై కథనం.

దుస్తులు సరిచేసుకోండి..

ఒకప్పుడు ఏకరూప దుస్తులంటే ప్రైవేట్‌ స్కూళ్లకే అన్న భావన ఉండేది. ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లోనూ పిల్లలు ఉచిత దుస్తులు ధరిస్తున్నారు. వేకువ జామునే దుస్తులు సర్దుకోండి.. ఏమైనా లోటుపాట్లు ఉంటే సరిచేయండి. లేకుంటే మొదటి రోజు బడికి వెళ్లడానికి ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి.

షూస్‌ సిద్ధ్దం చేసుకోండి..

పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో బూట్లు, సాక్సులు వేకువజామునే బయటకు తీయండి. వేసవి సెలవుల నాటి నుంచి బూట్లలోనే సాక్స్‌ ఉండి ఉంటే వాటిలోకి పురుగులు చేరే అవకాశం ఉంది. మరీ పాతవి అయితే ఈ పాటికే చిరిగిపోయి ఉంటాయి. ముందుగానే వీటిని బయటకు తీస్తే పరిస్థితి అర్థమవుతుంది. వాటితోనే సర్దుబాటు చేసుకోవచ్చా అనే విషయం తెలుస్తుంది.

ప్రణాళికతో ముందుకు..

బడికి వెళ్లాలంటే పిల్లల చదువులకు అవసరమైన పుస్తకాలు, బ్యాగులు, ఏకరూప దుస్తులు ఇతర వస్తువులు సమకూర్చాలి. కొందరు ఉన్నవాటితోనే సర్దుకుపోతారు. మరికొంత మంది అన్నీ కొత్తవి కావాలనే దృక్పథం కలిగి ఉంటారు. మరోవైపు ప్రైవేట్‌ చదువులంటే యాజమాన్యాలు అడిగినంత ఇవ్వడానికి అప్పులు తప్పేలా లేవు. అయితే తల్లిదండ్రుల ఆలోచన దృక్పథం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. ముందు చూపుతో వేసిన చిట్టీలను ఇప్పుడు వాడుకుంటున్నారు. ఇంకొందరు స్నేహితులు, బంధువుల వద్ద రుణం తీసుకుంటున్నారు.

పొద్దున్నే సర్దుకోండి..

ప్రొగ్రెస్‌ రిపోర్టు తీసుకున్నాక ఎన్ని మార్కులు వచ్చాయో చూసుకోకుండా వేసవి సెలవుల సంబరాల్లో నిమగ్నమయ్యారు. ప్రధానంగా పుస్తకాలు, బ్యాగులు మూలన పడేశారు. తల్లిదండ్రులు ఈ రోజు బడి అనగానే కొన్ని గంటల ముందు పిల్లల బ్యాగులను బయటకు తీసే పనిలో నిమగ్నమవుతారు. కొన్ని ఇళ్లలోనైతే సెలవులకు ముందు ఒక మూలకు పడేసిన బ్యాగులు కనిపించడం లేదని హైరానా కనిపిస్తోంది. ఇది సరైన విధానం కాదు. ఏదైనా కారణం చేత అలసత్వం ప్రదర్శించి ఉంటే వేకువ జామునే లేచి బయటకు తీయాలి.

విద్యానగర్‌(కరీంనగర్‌): కరీంనగర్‌ ఓల్డ్‌ హైస్కూల్‌.. నిజాం నవాబు కాలంలో పురుడుపోసుకుంది. ఎందరికో ఓనమాలు దిద్దించి, ప్రస్తుతం మల్టీపర్పస్‌ హైస్కూల్‌గా కొనసాగుతోంది. 83 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన పాఠశాల ఒడిలో చదువుకున్న వారు మేధావులుగా పేరుగాంచారు. దేశాన్ని పాలించిన నేతల నుంచి, విద్యావేత్తలు. రాజకీయ ఉద్దండులు, కవులు, కళాకారులుగా పేరుగాంచారు. దక్షిణ భారతదేశం నుంచి తొలి తెలుగు ప్రధాని అయిన పీవీ నర్సింహరావు, జాతీయ సాహిత్యంలో అత్యున్నతమైన జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్‌ సి.నారాయణరెడ్డి, పద్మభూషణ్‌, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ ఉప కులపతిగా వ్యవహరించిన చెన్నమనేని హన్మంతరావు, స్వాతంత్య్ర సమరయోధుడు బోయినపల్లి వెంకటరామారావు, విద్యావేత్త వెలిచాల కొండల్‌రావు, బొమ్మ సత్యనారాయణ, మాజీ వైస్‌చాన్స్‌లర్లు జె.రాంరెడ్డి, నవనీతరావు, బాపురెడ్డి, ఐఏఎస్‌ ముద్దసాని పురుషోత్తంరెడ్డి, కరీంనగర్‌ మాజీ ఎంపీ, ఆర్టీసీ చైర్మన్‌ ఎం.సత్యనారాయణరావు, మాజీ మంత్రులు సి.ఆనంద్‌రావు, టి.జీవన్‌రెడ్డి, వెలిచాల జగపతిరావు, మాజీ ఎమ్మెల్యేలు సాన మారుతి, ముద్దసాని దామెదర్‌రెడ్డి, బొమ్మ వెంకన్నలాంటి ఎందరో మేధావులు ఈ పాఠశాలలో అక్షరాలు దిద్దినవారే.

పెద్దపీట వేయాలి

విద్యా చట్టానికి ప్రాముఖ్యం ఇస్తూ.. విద్యారంగానికి పెద్దపీట వేయాలి. కరీంనగర్‌ ఓల్డ్‌ హైస్కూల్‌ ప్రాముఖ్యం అంతా ఇంతాకాదు. నేను కూడా ఆ ప్రభుత్వ పాఠశాలలోనే చదివాను. ప్రభుత్వ విద్యపై విశ్వాసం కల్పించాల్సి న బాధ్యత అందరిపై ఉంది.

– బూరుగుపల్లి రవీందర్‌, రిటైర్డ్‌ టీచర్‌, కరీంనగర్‌

కరీంనగర్‌లోని ఓల్డ్‌ హైస్కూల్‌

అడగండి..

అడుగేయండి

పాఠశాలలు ప్రారంభం అవుతున్నాయి. ప్రైవేటు స్కూళ్లలో తమ పిల్లలను చేర్పించే ముందు ఒక్కసారి ఆలోచించండి. మీరు అనుకున్న పాఠశాల మంచిదేనా..? అనుమతి ఉందా..? సౌకర్యాలు బాగున్నాయా..? ఉపాధ్యాయు ల పరిస్థితిపై ఆరా తీయండి.. ఒకటికి రెండుసార్లు పరిశీలించండి. 8లోu

అమ్మతో కలిసి పోయేది

మా అమ్మానాన్న కోయ నాగేశ్వరరావు, సులోచన ప్రభుత్వ ఉపాధ్యాయులు. వేసవి సెలవులు పూర్తయ్యాక అందిరిలాగే అమ్మ పనిచేసే ఖమ్మం జిల్లా బోనకల్‌ మండలం రావినూతల సర్కారు బడికి తొలిరోజు నుంచే పోయేవాడిని. అక్కడే ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదివా. మొదటిరోజు ఫ్రెండ్స్‌తో ఆటాపాలతో గడిచిపోయింది. జీవితంలో పైకిరావడానికి బుడిబుడిఅడుగులు అక్కడే పడ్డాయి. ప్రైవేట్‌ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య దొరుకుతుందని అనుకోవడం పొరపాటు. ప్రభుత్వ పాఠశాలల్లో గతంకంటే మౌలిక వసతులు పెరిగాయి. అన్నింటిపై పట్టుసాధించేందుకు అవకాశం ఉంటుంది.

– కోయ శ్రీహర్ష, కలెక్టర్‌, పెద్దపల్లి

సంచులే బ్యాగ్‌లు

నా విద్యాభ్యాసం మొత్తం ప్రభుత్వ పాఠశాలల్లోనే పూర్తయ్యింది. నాన్నస్కూల్‌లో జాయిన్‌ చేస్తే.. నాకంటే ఒక్క క్లాస్‌ పెద్దయిన మా బ్రదర్‌తో కలిసి నడుచుకుంటూ పోయేవాడిని. ఎనిమిదో తరగతి వరకు ఉప్పల్‌, తొమ్మిదో తరగతి హుజూరాబాద్‌, పదో వతరగతి మళ్లీ ఉప్పల్‌ ప్రభుత్వ పాఠశాలలోనే చదివా. బియ్యపు సంచులను బ్యాగ్‌లుగా తయారుచేసి కుట్టిస్తే, వాటిని భుజానికి వేసుకోని స్కూల్‌కు పోయేవాళ్లం. తొలిరోజు స్కూల్‌కి పోయినప్పుడు వర్షం పడేది. అప్పుడు పుస్తకాలు తడవకుండా షర్ట్‌ జేబులో దాచుకునేవాడిని. చిన్నారులను సర్కారు బడికే పంపించాలి. వారిపై ఖర్చుచేసే డబ్బు ఆదా చేస్తే భవిష్యత్‌లో ఎంతోఉపయోగపడుతుంది.

– కరుణాకర్‌, డీసీపీ, పెద్దపల్లి

పోదాం పదా బడికి1
1/5

పోదాం పదా బడికి

పోదాం పదా బడికి2
2/5

పోదాం పదా బడికి

పోదాం పదా బడికి3
3/5

పోదాం పదా బడికి

పోదాం పదా బడికి4
4/5

పోదాం పదా బడికి

పోదాం పదా బడికి5
5/5

పోదాం పదా బడికి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement