
రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా
రామడుగు: రౌడీ, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సీపీ గౌస్ ఆలం సిబ్బందికి సూచించారు. రామడుగు పోలీస్స్టేషన్ను బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నూతనంగా విధుల్లో చేరిన కానిస్టేబుళ్లు స్టేషన్లో అన్ని విధులు సక్రమంగా నేర్చుకోవాలని, రికార్డు నిర్వహణ, సీసీటీఎన్ఎస్, రిసెప్షన్, కోర్టుడ్యూటీ, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలపై సీనియర్ల ద్వారా నేర్చుకోవాలన్నారు. సీసీటీఎన్ఎస్ 2.0, పిటిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఈ– సమన్ల జారీ గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పలు రికార్డులు తనిఖీ చేశారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ శుభం ప్రకాశ్, చొప్పదండి సీఐ ప్రదీప్కుమార్, రామడుగు ఎస్సై రాజు పాల్గొన్నారు.
చెత్త తరలింపుపై ఎమ్మెల్యే కవ్వంపల్లి అభ్యంతరం
మానకొండూర్: కరీంనగర్లోని చెత్తను మానకొండూర్ పరిధిలోని ముంజంపల్లి శివారులో ఉన్న తమిళకాలనీ సమీపంలోని గుట్టవద్ద డంప్ చేయడంపై మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశా రు. కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్ చాహత్ బాయ్పేయ్తో కలిసి బుధవారం తమిళకాలనీ వద్ద ఉన్న చెత్తడంప్ను పరిశీలించారు. కరీంనగర్ నుంచి వెలువడే చెత్తను మానకొండూర్కు తరలిస్తే ఏర్పడే ఇబ్బందులపై చర్చించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చెత్తను ఇక్కడకు తరలించవద్దని సూచించారు. సదాశి వపల్లి స్టేజీ వద్ద ప్రమాదాలు జరుగకుండా చేప ట్టాల్సిన రోడ్డు డైవర్షన్ గురించి చర్చించారు. అసిస్టెంట్ కమిషనర్ వేణుమాధవ్, పర్యావరణ ఇంజినీర్లు స్వామి, రమేశ్ పాల్గొన్నారు.
పంట మార్పిడితో అధిక దిగుబడి
కరీంనగర్రూరల్: పంట మార్పిడి విధానంతో రైతులు అధిక దిగుబడులు సాధించే అవకాశముందని కృషి విజ్ఞాన కేంద్రం ప్రధానశాస్త్రవేత్త వెంకటేశ్వర్రావు తెలిపారు. బుధవారం కేంద్ర ప్రభుత్వ ఆద్వర్యంలో చేపట్టిన వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా తాహెర్కొండాపూర్, చామనపల్లిలో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు వెంకటేశ్వర్రావు, సువర్ణ, వేణుగోపాల్ పంటల సాగులో ఆధునిక పద్ధతులు, వరి వంగడాలు, ఆయిల్పామ్లో అంతరపంటల సాగుపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాల్లో ఏవో బి.సత్యం పాల్గొన్నారు.
పవర్కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు పనులతో పాటు లైన్ల సర్దుబాటు పనుల నేపథ్యంలో గురువారం నగరంలోని పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిపివేయ నున్నారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు 11 కె.వీ.శివనగర్ ఫీడర్ పరిధిలోని శివనగర్, ప్రగతినగర్, టెలిఫోన్ క్వార్టర్స్, లారెల్ స్కూల్, బతుకమ్మకాలనీ, సప్తగిరికాలనీ ప్రాంతాలు, ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు 11 కె.వీ.అల్కాపురి ఫీడర్ పరిధి లోని అల్కాపురి, శ్మశానవాటిక ప్రాంతాల్లో వి ద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్–2 ఏడీ ఈ ఎం.లావణ్య తెలిపారు. ఉదయం 7 నుంచి 10 గంటల వరకు 11 కె.వీ.విద్యానగర్ ఫీడర్ పరిధి లోని హిందూపురికాలనీ, ఆర్టీసీ వర్క్షాపు, వర్క్షాపు ముందు, సువిద్య స్కూల్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 1 ఏడీఈ పి.శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు.
రేపు నీటి సరఫరాకు అంతరాయం
కరీంనగర్కార్పొరేషన్: నగరంలోని హైలెవెల్ జోన్ అంబేడ్కర్ రిజర్వాయర్ పరిధిలో ఈ నెల 13వ తేదీన తాగునీటి సరఫరాకు అంతరా యం ఏర్పడుతుందని ఈఈ సంజీవ్ తెలిపా రు. రిజర్వాయర్ పరిధిలోని బండ పోచన్న షాప్ నుంచి గాంధీరోడ్ వరకు ఉన్న పైప్లైన్ లీకేజీలకు మరమ్మతులు చేపడుతున్నట్లు తెలి పారు. ఫలితంగా 2, 3, 4, 5, 24,25,26,27, 28,42,44 డివిజన్లకు నీటి సరఫరా ఉండదని, నీటిని పొదుపుగా వాడుకోవాలని అన్నారు.

రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా

రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా