
సర్కార్ కాలేజీలోనే చేరాలి
ప్రైవేట్ కళాశాలలతో పోల్చినపుడు ఏ విషయంలోనైనా ప్రభుత్వ కళాశాలలే ముందు వరుసలో ఉంటున్నాయి. ఫలితాల విషయంలోనూ రాజీ పడడం లేదు. పోటీ పరీక్షలతో పాటు అన్ని రంగాల్లో రాణిస్తున్నవారిలో ప్రభుత్వ కాలేజీల పిల్లలే ఉంటున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలి. సర్కార్ కాలేజీల్లోనే అడ్మిషన్లు తీసుకోవాలి. లక్షల విలువైన బీటెక్ లాంటి సాంకేతిక కోర్సులు ఉచితంగా చదివే అవకాశాన్ని జారవిడుచుకోవద్దు.
– వి.శ్రీనివాస్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి
కార్పొరేట్కు దీటుగా..
లక్షల్లో ఫీజులు తీసుకునే ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల కన్నా మా కాలేజీ విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించేందుకు ఎక్కువగా కష్టపడుతున్నాం. పరీక్షల సమయంలో ఉదయం పూట నిద్ర మేల్కొల్పడం నుంచి పరీక్షలన్నింటిలో విజయం సాధించే వరకు అందరం కృషి చేస్తున్నాం. ఎప్సెట్, నీట్ వంటి పోటీ పరీక్షలకు శిక్షణనిస్తున్నాం. అపార బోధనానుభవం, ఉన్నత విద్యార్హతలున్న లెక్చరర్లు ఉంటారు కాబట్టి ప్రతిసారి ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాం.
– కనకశ్రీ విజయ రఘునందన్, ప్రిన్సిపాల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల
ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం
ఇక్కడ చేరిన ప్రతి విద్యార్థిని వృద్ధిలోకి తెచ్చేందుకు అన్ని విధాలా శ్రద్ధ తీసుకుంటున్నాం. మూడు నెలలకోసారి పేరెంట్స్తో చర్చిస్తున్నాం. వీక్లీ, మంత్లీ టెస్టులతో పాటు పాఠ్యాంశాలపై క్విజ్ నిర్వహిస్తున్నాం. విద్యార్థులను బృందాలుగా విభజించి లెక్చరర్లను కేర్ టేకర్లుగా నియమిస్తున్నాం. ముఖ్యంగా ఆడపిల్లలకు భద్రత, భవిష్యత్తుకు గర్ల్స్ కాలేజ్ బెస్ట్ అని నిరూపిస్తున్నాం.
– జి.వనజాకుమారి, ప్రిన్సిపాల్,
సెస్ బాలికల జూనియర్ కళాశాల

సర్కార్ కాలేజీలోనే చేరాలి

సర్కార్ కాలేజీలోనే చేరాలి