
జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపిక
వేములవాడ: సివిల్ జడ్జి(జూనియర్ బెంచ్) పరీక్షల్లో వేములవాడకు చెందిన సంకెపల్లి జాహ్న వి అర్హత సా ధించారు. పట్టణంలోని భీమేశ్వరాలయం వీధికి చెందిన ఎస్.హరికిషన్ కూతురు జాహ్నవి ఉస్మానియా యూనివర్సిటీలో బీకాం ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. ప్రస్తుతం న్యాయశాస్త్రంలో పీహెచ్డీ చేస్తున్నా రు. నాలుగో ప్రయత్నంలో జడ్జిగా అర్హత సాధించారు.
పోగొట్టుకున్న బ్యాగ్ అప్పగింత
జగిత్యాలటౌన్: జగిత్యాల నుంచి వరంగల్ వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికురాలు పోగొట్టుకున్న బ్యాగ్ను తిరిగి ఆమెకు అప్పగించారు సిబ్బంది. జగిత్యా ల డిపోకు చెందిన బస్సులో వరంగల్కు చెందిన సులోచన కరీంనగర్లో ఎక్కింది. తులం బంగారం, సెల్ఫోన్, డబ్బులు ఉన్న బ్యాగ్ ను బస్సులో మరిచిపోయి దిగిపోయింది. బస్ కండక్టర్ గంగప్రసాద్ ఆ బ్యాగ్ను గుర్తించి జగిత్యాల డిపోలో అప్పగించారు. ఇంటికెళ్లిన ప్రయాణికురాలు బ్యా గ్ పోగొట్టుకున్న విషయాన్ని గుర్తించి టికెట్ ఆధారంగా జగి త్యాల డిపోకు చేరుకుంది. అన్ని ఆధారాలను పరిశీలించిన ఆర్టీసీ సిబ్బంది ఆ బ్యాగును ఆమెకు అందించారు. బ్యాగును అందించిన కండక్టర్ గంగప్రసాద్, సిబ్బ ందికి సులోచన ధన్యవాదాలు తెలిపారు. డిపో క్లర్క్ మొండయ్య తదితరులు ఉన్నారు.

జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపిక