అక్షరయజ్ఞం చేస్తున్న ‘సాక్షి’పై దాడులు..?
కక్ష సాధింపు మానుకోవాలి
కామారెడ్డి టౌన్/బా న్సువాడ/ఎల్లారెడ్డి: ప్రజా సమస్యలను ఎత్తిచూపుతూ నిరంతరం అక్షరయజ్ఞం చేస్తున్న ‘సాక్షి’ దినపత్రిక, ఎడిటర్ ధనంజయరెడ్డిపై అక్రమ కేసులు బనాయించి గొంతు నొక్కేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. ఈ అన్యాయాలను, కుట్రలను అన్ని వర్గాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం సాక్షి దినపత్రికపై కక్ష సాధింపు మానుకోవాలి. పత్రికా స్వేచ్ఛను కాపాడాలి. ప్రజల పక్షాన వార్తలు రాస్తున్న పత్రికతోపాటు ఎడిటర్, జర్నలిస్టులపై అక్రమ కేసులను ఎత్తివేయాలి.
– నీల నాగరాజు,
బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు
అక్షరయజ్ఞం చేస్తున్న ‘సాక్షి’పై దాడులు..?


