
ఎన్ఫోర్స్మెంట్ టీంకు క్యాష్ప్రైజ్
ఖలీల్వాడి: నిజామాబాద్ ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ టీంకు రాష్ట్ర ఎకై ్సజ్ డైరెక్టర్ కమలాసన్రెడ్డి మంగళవారం రూ. 15వేల క్యాష్ రివార్డు అందజేశారు. ఇటీవల నవీపేట్ మండలం యంచ వద్ద 30కిలోల డ్రై గంజాయి, ఒక కారు, రెండు మోటార్ సైకిళ్లను ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది స్వాధీనం చేసుకుని, ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈసందర్భంగా వారిని అభినందిస్తూ క్యాష్ప్రైజ్ను అందజేశారు. అలాగే ఫిబ్రవరి 14న కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్లో 91కిలోల ఎండుగంజాయిని పట్టుకున్నారు. వీరికి రూ.30 వేల క్యాష్ ప్రైజ్ ఇచ్చారు. ఎకై ్సజ్ అదనపు కమిషనర్ ముఖర్జీ, డీసీ సోమిరెడ్డి, ఎస్టీఎఫ్ అసిస్టెంట్ కమిషనర్ ప్రణవని, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ప్రదీప్ ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ స్వప్న, ఎస్సై రామకుమార్, సిబ్బంది హమీద్, అవినాష్, విష్ణు, సుకన్య, శ్యామ్ సుందర్, సాయి కుమార్లు ఉన్నారు.