ఉగ్రదాడిని ప్రతిఒక్కరూ ఖండించాలి | - | Sakshi
Sakshi News home page

ఉగ్రదాడిని ప్రతిఒక్కరూ ఖండించాలి

Apr 30 2025 12:11 AM | Updated on Apr 30 2025 12:11 AM

ఉగ్రదాడిని ప్రతిఒక్కరూ ఖండించాలి

ఉగ్రదాడిని ప్రతిఒక్కరూ ఖండించాలి

తెయూ(డిచ్‌పల్లి): జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రం పహల్గాంలో పర్యాటకులపై పాకిస్తాన్‌ ఉగ్రవాదులు దాడి చేసి హతమార్చడాన్ని ప్రతి ఒక్క భారత పౌరుడు ఖండించాలని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ యాదగరి అన్నారు. తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్‌ అసోసియేషన్‌ (టూటా) ఆధ్వర్యంలో మంగళవారం పహల్గాం అమరుల కుటుంబాలకు సంఘీభావం తెలియజేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని, మాట్లాడారు. ఉగ్రదాడికి ప్రతిగా కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్‌కు, ముస్లిం ఉగ్రవాదులకు ధీటైన జవాబు ఇవ్వాలన్నారు. ప్రిన్సిపాల్‌ మామిడాల ప్రవీణ్‌, టూటా అధ్యక్షుడు పున్నయ్య, కోశాధికారి నాగరాజు, వర్సిటీ ఎస్‌బీఐ బ్రాంచ్‌ మేనేజర్‌ శివనారాయణసింగ్‌, అధ్యాపకులు శిరీష, వాసం చంద్రశేఖర్‌, పాత నాగరాజు, బాలకిషన్‌, మహేందర్‌ రెడ్డి, స్రవంతి, స్వప్న, నాన్‌ టీచింగ్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ సాయాగౌడ్‌, అవుట్‌సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ అధ్యక్షుడు సురేష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement