
కువైట్లో ఎల్లారెడ్డిపల్లెవాసి మృతి
ఇందల్వాయి: మండలంలోని ఎల్లారెడ్డిపల్లె గ్రామానికి చెందిన గోషికొండ గంగ నర్సయ్య(36) శుక్రవారం కువైట్లో అనారోగ్యంతో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతుడు నాలుగు సంవత్సరాలుగా కువైట్లో ఉంటున్నాడని, మృతుడికి భార్య, ఏడేళ్ల లోపు ఇద్దరు కొడుకులు ఉన్నట్లు తెలిపారు. మృతదేహం స్వగ్రామం చేరుకునేలా ప్రభుత్వం చొరవ చూపాలని మృతుడి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
చోరీ సొత్తుతో పట్టుబడ్డ దొంగ
రాజంపేట: చోరీకి పాల్పడి సొత్తుతో బైక్పై వెళ్తున్న దుండగుడు పోలీసులకు పట్టుబడ్డాడు. ఎస్సై పుష్పరాజ్ తెలిపిన వివరాలు ఇలా.. రాజంపేట పోలీస్ స్టేషన్ సిబ్బంది ప్రేమ్సింగ్, మహమ్మద్ అజీమ్లు సోమవారం రాత్రి గస్తీ నిర్వహిస్తుండగా తెల్లవారుజామున అనుమానాస్పదంగా బైక్పై వెళ్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వాహనాన్ని తనిఖీ చేయగా అతడు చోరీ చేసిన సొమ్ము, వస్తువులు కనిపించాయి. నిందితుడు భిక్కనూర్ మండలం, కామారెడ్డి పట్టణంలో దొంగతనాలకు పాల్పడినట్లు గుర్తించి, కేసు నమోదు చేశారు. అనంతరం జ్యుడీషియల్ రిమాండ్కు పంపించారు. రాత్రివేళ నైట్ డ్యూటీ నిర్వహిస్తూ నిందితుడిని పట్టుకున్న కానిస్టేబుళ్లను ఎస్సై పుష్పరాజ్ అభినందించారు.
షార్ట్సర్క్యూట్తో గడ్డి దగ్ధం
మోపాల్: మండలంలోని సిర్పూర్ గ్రామంలో సోమవారం రాత్రి డీసీఎంలో తరలిస్తున్న గడ్డికట్టలు షార్ట్ సర్క్యూట్తో దగ్ధమయ్యాయి. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని సిర్పూర్ నుంచి ముదక్పల్లికి డీసీఎంలో గడ్డి కట్టలు తీసుకెళ్తున్నారు. సిర్పూర్ గ్రామ పంచాయతీ వద్ద విద్యుత్ తీగలు వ్యాన్కు తగిలి మంటలు చెలరేగాయి. స్థానికులు బోరు పైపుతో నీరు పట్టి మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. కానీ గడ్డి కట్టలకు మంటలు అంటుకుని చెలరేగడంతో గ్రామస్తులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారమందించారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో డీసీఎం వ్యాన్ స్పల్పంగా దెబ్బతినగా, గడ్డి కట్టలు కాలిపోయాయి.
డ్రంకన్డ్రైవ్ కేసులో మూడురోజుల జైలుశిక్ష
డిచ్పల్లి: మండల కేంద్రంలోని నాగ్పూర్ గేట్, సీఎంసీ చౌరస్తాలో ఈ నెల 20న ఎస్సై ఎండీ షరీఫ్ ఆధ్వర్యంలో పోలీసులు డ్రంకన్డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. బీబీపూర్ తండాకు చెందిన బదావత్ మంగులాల్, మహరాష్ట్రకు చెందిన శ్రీరంగు రామ మద్యం తాగి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డారు. వారిని మంగళవారం కోర్టులో హాజరుపర్చగా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ రహీముద్దిన్ నిందితులకు మూడు రోజుల జైలు శిక్ష విధించారు. దీంతో నిందితులను జైలుకు తరలించినట్లు ఎస్సై తెలిపారు.
దోమకొండలో వ్యక్తి అదృశ్యం
దోమకొండ: మండల కేంద్రానికి చెందిన అవధూత నర్సింలు (49) అదృశ్యమైనట్లు ఎస్సై స్రవంతి మంగళవారం తెలిపారు. ఈనెల 25న ఉదయం నర్సింలు ఇంట్లో మేస్త్రి పనికి వెళ్లి వస్తా అని చెప్పి బయటకు వెళ్లాడు. ఇప్పటివరకు తిరిగి ఇంటికి రాలేడు. నాలుగు రోజులుగా కుటుంబసభ్యులు ఎంత వెతికినా అతడి ఆచూకీ లభించలేదు. దీంతో మంగళవారం నర్సింలు కుమారుడు సిద్ధిశ్వర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు.

కువైట్లో ఎల్లారెడ్డిపల్లెవాసి మృతి

కువైట్లో ఎల్లారెడ్డిపల్లెవాసి మృతి