
పేకాడుతున్న ఏడుగురి అరెస్టు
ఖలీల్వాడి/ఆర్మూర్టౌన్: ఆర్మూర్ శివారులోని బైపాస్ రోడ్డులో గల మల్లారెడ్డి గెస్ట్హౌస్లో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై ఆదివారం నిజామాబాద్ సీసీఎస్ పోలీసులు దాడి చేశారు. విశ్వసనీయ సమాచారం రావడంతో సీపీ సాయిచైతన్య ఆదేశాల మేరకు నిజామాబాద్ సీసీఎస్ ఏసీపీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో సీసీఎస్ సీఐ రవికుమార్, సిబ్బంది దాడి చేశారు. పేకాట ఆడుతున్న ఏడుగురిని పట్టుకున్నారు. అలాగే వారి వద్ద నుంచి రూ.21830 నగదును స్వాధీనం చేసుకున్నారు. రూ.2,35,000 ఆన్లైన్ చెల్లింపులు యూపీఏల ద్వారా చెల్లించినట్లు గుర్తించి ఫోన్లను సీజ్ చేశారు. అనంతరం ఆర్మూర్ పోలీసులకు అప్పగించారు.
శివాలయంలో చోరీ
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని మెంగారం గ్రామంలోని శివాలయంలో దుండగులు చోరీకి పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆలయం తాళాలను దుండగులు శనివారం రాత్రి ఇనుప రాడ్తో పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. అలాగే ఆలయంలో ఉన్న హుండీని పగుల గొట్టి నగదు, అమ్మవారి మెడలో గల బంగారు పుస్తెను అపహరించారు. ఆలయంలో చోరీ జరగడం ఇది నాలుగోసారి కావడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దొంగతనాల నివారణకు పోలీసులు పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
నగరంలో ఆపరేషన్ ఛబుత్రా
ఖలీల్వాడి: నగరంలోని బర్కత్పురా, గాజులపేట్, హయిత్గల్లీ, శివాజీనగర్, అహ్మద్పురా కాలనీలో ఆదివారం రాత్రి పోలీసులు ఆపరేషన్ ఛబుత్రా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయా కాలనీల్లోని ప్రజల వాహనాలకు సంబంధించిన పత్రాలను పోలీసు సిబ్బంది పరిశీలించారు. 36 బైక్లు, 6 ఆటోలకు పత్రాలు లేకపోవడంతో సీజ్ చేశారు. పాత నేరస్తులు, రౌడీషీటర్ల గురించి తెలుసుకున్నారు. ఎవరైనా అనుమానితులు ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. పట్టణ సీఐ శ్రీనివాస్ రాజు, ఎస్సైలు యాసీన్ ఆరాఫత్, హన్మండ్లు, ఆర్ఎస్సై అజయ్, సిబ్బంది పాల్గొన్నారు.

పేకాడుతున్న ఏడుగురి అరెస్టు