
మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ
ఎల్లారెడ్డిరూరల్/ఎల్లారెడ్డి : ఎల్లారెడ్డి మండలంలోని సోమార్పేట్ గ్రామ శివారులో గల నిజాంసాగర్ బ్యాక్ వాటర్లో నీట మునిగి మృతి చెందిన ముగ్గురు యువకుల కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే మదన్మోహన్రావు మంగళవారం పరామర్శించారు. ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం త్వరగా పూర్తి చేసి కుటుంబ సభ్యులకు మృత దేహాలను అప్పగించారు. అనంతరం వారి ఇంటికి వెళ్లి ఓదార్చారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందేలా చర్యలను తీసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సాయిబాబా, కుడుముల సత్యనారాయణ, ప్రశాంత్గౌడ్ , విద్యాసాగర్, నునుగొండ శ్రీనివాస్, వెంకట్రాంరెడ్డి, శ్రీనివాస్రెడ్డి తదితరులున్నారు. అలాగే నీట మునిగి మృతి చెందిన ముగ్గురి యువకుల కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ పరామర్శించారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అరవింద్, ఇమ్రాన్, మండల పార్టీ అధ్యక్షులు జలందర్రెడ్డి, సతీష్ తదితరులున్నారు.
అమెరికాలో మృతి చెందిన యువకుడి కుటుంబ సభ్యులకు..
తిమ్మారెడ్డి గ్రామానికి చెందిన యువకుడు గోవర్ధన్ అమెరికాలో మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే మదన్మోహన్రావు ఓదార్చారు. గోవర్ధన్ ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు.

మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ