
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ఎదురెదురుగా వాహనాలు ఢీకొని ఘటన
తాళ్లపూడి: మండలంలోని అన్నదేవరపేట వద్ద రెండు మోటార్ సైకిళ్లు ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై టి.రామకృష్ణ తెలిపిన వివరాల మేరకు అన్నదేవరపేటకు చెందిన కొయ్య ముత్యాలు (38) ఠాగూర్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. గురువారం ఉదయం పని ముగించుకుని తన స్కూటీపై ఇంటికి వస్తుండగా అదే గ్రామానికి చెందిన ఎస్కే సుధీర్ తాళ్లపూడి నుంచి అన్నదేవరపేట వస్తూ అన్నదేవరపేట సొసైటీ వద్ద పరస్పరం ఢీకొన్నారు. ఈ ఘటనలో ముత్యాలు తీవ్రంగా గాయపడి సంఘటనా ప్రదేశంలో మృతి చెందాడు. గాయాలపాలైన సుధీర్ను 108లో గోపాలపురం ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
యువకుడికి నివాళి
ముత్యాలు కుటుంబ సభ్యులను వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తలారి వెంకట్రావు, నాయకులు పిట్టా శ్రీనివాస్ పరామర్శించారు. సంతాపం తెలియజేశారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి