
విమానాశ్రయంలో మాక్డ్రిల్
కోరుకొండ: యుద్ధ పరిస్థితుల్లో ప్రజలు ఏవిధంగా స్పందించాలనే అంశంపై కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం విమానాశ్రయంలో ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ ఏఎస్పీ చెంచిరెడ్డి ఆధ్వర్యాన గురువారం సాయంత్రం మాక్డ్రిల్ నిర్వహించారు. బాంబు పేలుళ్లు జరిగినప్పుడు విమాన ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేలా ఈ కార్యక్రమం నిర్వహించారు. బాంబింగ్ సమయంలో ప్రయాణికులు పరుగులు తీయకుండా నేలకు వాలి ఉండటం సురక్షితమని చెప్పారు. కార్యక్రమంలో విమానాశ్రయం ఇన్చార్జి డైరెక్టర్ శ్రీకాంత్, ఎస్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ ప్రసాదరావు, అగ్నిమాపక అధికారి గుప్తా, కోరుకొండ సీఐ సత్యకిషోర్, ఎస్సై కూన నాగరాజు తదితరులు పాల్గొన్నారు.