
మోయలేని భారం!
ఇదీ జరుగుతోంది..
పేద విద్యార్థులకు 25శాతం ఉచిత సీట్లను జిల్లాలోని ఏ ఒక్క ప్రైవేటు పాఠశాల కేటాయించడం లేదు. ఎక్కడా లాటరీ పద్ధతిలో ప్రవేశాలు జరగడం లేదు. ప్రైవేటు, కార్పొరేట్ స్థాయి పాఠశాలలు బహిరంగంగానే అడ్మిషన్ ఫీజు వసూలు చేస్తున్నాయి. ఇది నిబంధనలకు విరుద్దమే అయినా అడిగేవారు లేరు. పాఠశాల అభివృద్ధి, సిబ్బంది సంక్షేమం, క్రీడలు, పరీక్ష ఫీజు, సాంస్కృతిక కార్యక్రమాల పేరిట యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. జిల్లా ఏర్పడిన నాటి నుంచి ఇంతవరకు అధికారుల ఆధ్వర్యంలోని కమిటీ కూర్చుని చర్చించకపోవడం గమనార్హం. ఇక పాఠశాల స్థాయిని బట్టి విద్యార్థుల నుంచి ఫీజులను వసూలు చేస్తున్నారు. ప్రాధాన్యత తక్కువ ఉన్న పాఠశాలలో ఎల్కేజీకి రూ.10వేలు, ఓ మోస్తరు పాఠశాలలో రూ.15వేలు, డిమాండ్ అధికంగా ఉన్న పాఠశాలలో రూ.20వేల నుంచి రూ.25వేలు వసూలు చేస్తున్నారు. పదో తరగతి విద్యార్థులకు పాఠశాల స్థాయిని బట్టి రూ.30 వేల నుంచి రూ.60 వేలు వసూలు చేస్తున్నారు.దీనికితోడు యూనిఫాం దుస్తులు, పుస్తకాలు, షూస్, టై, బెల్టులను ఆయా పాఠశాలల సమీపంలో అనుబంధంగా ఏర్పాటు చేసిన దుకాణాల్లో విక్రయిస్తున్నారు. పాఠశాల పేరుతో ముద్రించినవి కావడంతో తల్లిదండ్రులు అధిక ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారు.
● సామాన్యుడి ఆదాయంలో 40 శాతం పిల్లల చదువులకే..
● ఫీజుల నియంత్రణ జీఓ 91 అమలెక్కడ
● విద్యాహక్కు చట్టానికి తూట్లు
గద్వాలటౌన్: ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణతోపాటు పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందించే లక్ష్యంగా ప్రత్యేకంగా విద్యాహక్కు చట్టం తెచ్చినా.. జిల్లాలో ఎక్కడా అమలు కావడం లేదు. జిల్లాలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేటు పాఠశాలలు ఈ చట్టాన్ని బేఖాతరు చేస్తున్నాయి. ఫీజులను అడ్డగోలుగా పెంచేస్తున్నా విద్యాధికారులు పట్టించుకోవడం లేదు. విద్యార్థుల తల్లిదండ్రులపై ఫీజుల భారం రోజురోజుకు అధికమవుతుంది.
జిల్లాలో మొత్తం
ప్రైవేటు స్కూల్స్ :
జీఓ 91పై కొరవడిన నియంత్రణ
ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులను నియంత్రించేందుకు ప్రభుత్వం జీఓ 91ని జారీ చేసి ఏళ్లు గడుస్తున్నా జిల్లాలో నియంత్రణ కొరవడింది. రోజు కూలి నుంచి ఉన్నత ఉద్యోగుల దాకా తమ పిల్లలను పేరున్న ప్రైవేటు పాఠశాలల్లో చదివించాలని తపన పడటం సహజం. తల్లిదండ్రుల ఆరాటాన్ని యాజమాన్యాలు సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. గడిచిన ఐదేళ్లలో ఫీజుల మోత నాలుగురెట్లు పెరిగింది. గతేడాదితో పోలిస్తే ఫీజులను 20 నుంచి 30శాతం పెంచేశారు. జిల్లాలోని ప్రైవేటు బడుల్లో సుమారు 40 వేల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. ఫీజుల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం జీఓ 91 విడుదలైంది. దీని ప్రకారం రెండు కేటగిరీల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాలను వేరు చేస్తూ రూ.8వేలు, రూ.12వేలు ఫీజులుగా నిర్ణయించారు. కానీ ఈ ఫీజులను జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల యాజమానులు పట్టించుకోవడం లేదు.
ప్రైవేటు పాఠశాలల్లో ఎడాపెడా ఫీజుల మోత
125