వైద్యుల నిర్లక్ష్యంతోపసికందు మృతి | - | Sakshi
Sakshi News home page

వైద్యుల నిర్లక్ష్యంతోపసికందు మృతి

Jun 14 2025 7:43 AM | Updated on Jun 14 2025 9:56 AM

వైద్యుల నిర్లక్ష్యంతోపసికందు మృతి

వైద్యుల నిర్లక్ష్యంతోపసికందు మృతి

గద్వాల క్రైం: వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే పసికందు మృతి చెందిందని ఆరోపిస్తూ బాధిత కుటుంబసభ్యులు శుక్రవారం రాత్రి సదరు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. బాధితుల కథనం మేరకు వివరాలిలా.. ధరూర్‌ మండలం రేవులపల్లికి చెందిన ఆశ్విని.. తన మూడు నెలల పాపకు జ్వరం రావడంతో వైద్య సేవల కోసం గద్వాల పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి ఈ నెల 11వ తేదీన తీసుకువచ్చింది. వైద్యులు ఆస్పత్రిలో జాయిన్‌ చేయించుకొని వైద్యం ప్రారంభించారు. కానీ, రోజులు గడుస్తున్నా పసికందు ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా పసికందు ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. దీంతో వైద్యుల సూచన మేరకు కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం కర్నూల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే పసికందు మృతి చెందినట్లు అక్కడి వైద్యులు పరీక్షించి చెప్పారు. దీంతో రోదిస్తూ రాత్రి గద్వాలలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి పసికందు కుటుంబసభ్యులు చేరుకున్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే పసికందు మృతి చెందినట్లు వైద్యులను నిలదీస్తూ ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పట్టణ ఎస్‌ఐ కళ్యాణ్‌కుమార్‌ ఆస్పత్రికి చేరుకుని బాధితులతో మాట్లాడి శాంతిపజేశారు. బాధితులు ఫిర్యాదు చేస్తే విచారణ చేపట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ తెలిపారు. ఈ విషయమై ప్రైవేట్‌ ఆస్పత్రి వైద్యుడు అశోక్‌కుమార్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. జ్వరంతో వచ్చిన పసికందుకు మెరుగైన వైద్యం అందించామని, ఎక్కడా నిర్లక్ష్యం వహించలేదని, కానీ, బిడ్డకు తల్లి పాలు ఇవ్వవద్దని సూచించామని, అయినా పాలు ఇవ్వడంతో గొంతులో సమస్య ఏర్పడి పరిస్థితి విషమించిందని అన్నారు.

ఆస్పత్రి వద్ద

కుటుంబసభ్యుల ఆందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement