
పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్
గద్వాల క్రైం: జిల్లాలోని పెండింగ్ కేసులు, రాజీకాదగా కేసుల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్ చేపట్టామని, ఈ నెల 14వ తేదీన జాతీయ లోక్అదాలత్ నిర్వహిస్తున్నామని జిల్లా జడ్జి ఎన్ ప్రేమలత వెల్లడించారు. గురువారం జిల్లా కోర్టు ఆవరణలో విలేకర్ల సమావేశం నిర్వహించి మాట్లాడారు. గతంతో పొలిస్తే నేటికి చాలా అంశాలను పరిగణలోకి తీసుకొని కేసుల సత్వర పరిష్కారానికి జాతీయలోక్ అదాలత్ నిర్వహించడం జరిగిందన్నారు. పోలీసు, ఎకై ్సజ్, రెవెన్యూ, రోడ్డు ప్రమాద, బ్యాంకు రుణాలు, స్టేషన్లలో నమోదైన కేసుల వివరాలను ఇప్పటికే ఆ శాఖ సిబ్బందితో మాట్లాడి విపత్కర కేసుల అంశాలను అడిగి తెలుసుకున్నట్లు వివరించారు. నేటి లోక్ అదాలత్ కార్యక్రమంలో 4వేల కేసులు పరిష్కారం అయ్యేలా చర్యలు చేపట్టామన్నారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ వి శ్రీనివాస్, శోభ తదితరులు ఉన్నారు.