
సర్కారు బడులు.. ప్రగతికి సోపానాలు
మాది వ్యవసాయ మధ్యతరగతి కుటుంబం. నా విద్యాభ్యాసం మొత్తం ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలలోనే సాగింది. 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఖిల్లాగణపురం మండలం మామిడిమాడలో, 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఖిల్లాగణపురం హైస్కూల్లో.. ఇంటర్, డిగ్రీ వనపర్తి ప్రభుత్వ కాలేజీ.. పీజీ ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి చేశాను. ప్రభుత్వ పాఠశాలలో క్వాలిఫైడ్ ఉపాధ్యాయులుంటారు. చదువుతో పాటు మానసిక ఉల్లాసం, సామాజిక స్పృహ, క్రీడలు వంటివి నేర్పిస్తారు. దీనివల్ల జీవితంలో ఎప్పుడైనా ఒడిదుడుకులు ఎదురైతే వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకెళ్లేందుకు ఉపయోగపడుతుంది. తరగతి గదుల్లోని పాఠ్యపుస్తకాలిని మాత్రమే కాకుండా సామాజంలో అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. గతంతో పోల్చితే ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇంగ్లిష్ మీడియంలో బోధిస్తున్నారు. ఉచితంగా పుస్తకాలు, నోట్బుక్కులు, మధ్యాహ్న భోజనం వంటి వసతులు కల్పిస్తున్నారు. విద్యావ్యవస్థపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధచూపుతూ అనేక సంస్కరణలు తీసుకొస్తుంది. వాటిని ప్రతిఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేటు వైపు మొగ్గు చూపకుండా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి వారి పిల్లల ఉజ్వల భవిష్యత్కు బాటలు వేయాలి. – వి.లక్ష్మీనారాయణ, అదనపు కలెక్టర్, గద్వాల