
వనమహోత్సవాన్ని విజయవంతం చేయాలి
గద్వాల: వనమహోత్సవం– 2025 కార్యక్రమంలో భాగంగా నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి స్థాయిలో చేరుకునేందుకు అన్ని శాఖల ప్రణాళికాబద్దంగా కృషి చేయాలని కలెక్టర్ సంతోష్ అన్నారు. బుధవారం ఐడీఓసీ కాన్పరెన్స్ హల్ నందు వన మహోత్సవంపై సంబందిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా జిల్లాకు 15 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు. జూలై, ఆగస్టు మాసాలలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని, ఈ రెండు నెలలో వివిధ శాఖలకు కేటాయించిన లక్ష్యాలను సాధించే విధంగా మొక్కలు నాటి మొక్కలను సంరక్షించాలన్నారు. వనమహోత్సవాన్ని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ న ర్సింగ్ రావు, డీపీఓ నాగేంద్రం, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పర్వేజ్ అమ్మాద్, తదితరులు ఉన్నారు.