
నాణ్యమైన విత్తనాలతో అత్యధిక దిగుబడులు
రాజోళి: నాణ్యమైన విత్తనాలను నాటడం వల్ల రైతులే నాణ్యమైన పంటలను పండించడంతోపాటు ఫౌండేషన్ విత్తనాలను సాటి రైతులకు అందించవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్, పాలెం శాస్త్రవేత్త సిద్దప్ప అన్నారు. మంగళవారం రాజోళిలోని రైతువేదికలో వారు ఫౌండేషన్ విత్తనాలను మండలంలోని 26 మంది రైతులకు పచ్చజొన్న, ఆర్ఎన్ఆర్ వడ్ల విత్తనాలను అందజేశారు. రైతులు ఈ విత్తనాలను నాటి వాటిని పండించిన అనంతరం వాటి ద్వారా ఫౌండేషన్ విత్తనాలను తీసి రైతులకు సరఫరా చేయాలన్నారు. మార్కెట్లో ఫౌండేషన్ విత్తనాలను రైతులే అందించేలా వీటిని సాగు చేయాలన్నారు. విత్తనోత్పత్తిలో రైతులు ముందుండి నాణ్యమైన విత్తనాలను మార్కెట్లోకి తీసుకురావాలన్నారు. గ్రామ గ్రామాన రైతులు విత్తనాలు నాటి నాణ్యమైన, లాభసాటి వ్యవసాయాన్ని సాధించవచ్చన్నారు. ఈ విత్తనాల కోసం పరిశోధన కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పని లేదన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి రాధ, ఇబ్రహిం, చంద్రశేఖరాచారి, శ్వేతారెడ్డి, హిమబిందు, పుష్ప పాల్గొన్నారు.