ఎల్లప్పుడూ కళ్ల ముందే ఉండాలని.. | - | Sakshi
Sakshi News home page

ఎల్లప్పుడూ కళ్ల ముందే ఉండాలని..

Jun 29 2025 2:48 AM | Updated on Jun 29 2025 2:48 AM

ఎల్లప్పుడూ కళ్ల ముందే ఉండాలని..

ఎల్లప్పుడూ కళ్ల ముందే ఉండాలని..

డోర్నకల్‌: కంటికి రెప్పలా చూసుకునే భర్త, అమ్మా అమ్మా అంటూ రోజుకు వెయ్యిసార్లు పలకరించే కుమారుడు అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో దిక్కు తోచని స్థితికి చేరుకున్న ఓ మహిళ తన భర్త, కుమారుడిని విగ్రహాల రూపంలో చూసుకుంటూ వారి జ్ఞాపకాలను నెమరువేసుకుంటుంది. డోర్నకల్‌ మండలం దుబ్బతండాకు చెందిన అజ్మీర బాల్యా, భారతి దంపతులకు సాయికుమార్‌ ఏకై క కుమారుడు. భారతి దుబ్బతండా సర్పంచ్‌గా పని చేసి భర్త బాల్యా సహకారంతో గ్రామాభివృద్ధిలో తమ వంతు పాత్రను సమర్థవంతంగా నిర్వహించింది. బాల్యా, భారతి వ్యవసాయం చేస్తుండగా కుమారుడు ఖమ్మంలో ఇంటర్‌ సెకండియర్‌ చదువుతున్నాడు. ఈ నెల 5న కుమారుడు సాయికుమార్‌ను కళాశాలకు పంపేందుకు బాల్యా ద్విచక్రవాహనంపై ఖమ్మం బయల్దేరగా ఖమ్మంలో ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొని బాల్యా, సాయికుమార్‌ మృతి చెందారు. వారిని మర్చిపోలేని భారతి.. బాల్యా, సాయికుమార్‌ విగ్రహాలను గ్రామ ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసింది. జూన్‌ 15న వారి సంతాప సభలోబాల్యా సాయికుమార్‌ విగ్రహాలను ఆవిష్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement