భర్త జ్ఞాపకాలతో.. | - | Sakshi
Sakshi News home page

భర్త జ్ఞాపకాలతో..

Jun 29 2025 2:48 AM | Updated on Jun 29 2025 2:48 AM

భర్త

భర్త జ్ఞాపకాలతో..

మహబూబాబాద్‌ రూరల్‌: కట్టుకున్న భర్తను ప్రాణంగా భావించి ఆయన మృతి అనంతరం పాలరాతితో విగ్రహం చేయించి ఓ భార్య ఆయనకు గుడి కట్టించింది. మహబూబాబాద్‌ మండలం సోమ్లా తండా గ్రామానికి చెందిన బానోత్‌ కల్యాణి ఎంపీటీసీగా పనిచేసింది. హరిబాబుతో ఆమెకు 1996లో వివాహం కాగా.. 2021లో హరిబాబు అనా రోగ్యంతో మృతిచెందాడు. ఆయనతోపాటే తాను చనిపోదామని కల్యాణి ప్రయత్నించినా బంధువులు ధైర్యం చెప్పడంతో హరిబాబు జ్ఞాపకాలతో జీవిస్తోంది. ఈక్రమంలో రూ.5.30 లక్షలతో పండుగ వాతావరణంలో గతేడాది ఏప్రిల్‌ 23న గుడి ప్రారంభించింది. ప్రతీ శనివారం ఆయనకు పూజలు చేస్తోంది.

భర్త జ్ఞాపకాలతో..
1
1/1

భర్త జ్ఞాపకాలతో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement