
విద్యకు అధిక ప్రాధాన్యం
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
టేకుమట్ల: ప్రజా ప్రభుత్వంలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శనివారం మండలంలోని అంకుషాపూర్ గ్రామ శివారులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో రూ.2కోట్ల 30 లక్షల నిధులతో నిర్మించిన అదనపు తరగతి గదులు, ప్రయోగశాల గదులను రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్రెడ్డి, కలెక్టర్ రాహుల్శర్మ, జెడ్పీ సీఈఓ విజయలక్ష్మితో కలిసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులు తమ లక్ష్యాన్ని ఎంచుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ ఎస్ఓ స్వప్న, మాజీ జెడ్పీటీసీ పులి తిరుపతిరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ అయిలయ్య, తహసీల్దార్ విజయలక్ష్మి, ఎంపీడీఓ అనిత, ఎంపీఓ సురేష్, ఆర్ఐ సంతోష్కుమార్ పాల్గొన్నారు.