
వేంకటేశ్వరుడికి విశేష అలంకరణ
చిల్పూరు: భూనీల సమేత శ్రీ బుగులు వేంకటేశ్వరస్వామి శుక్రవారం భక్తులకు విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. ఉదయం అర్చకులు రవీందర్శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యులు స్వామివారికి విశేష అభిషేక పూజలు నిర్వహించారు. ఈఓ లక్ష్మీప్రసన్న, చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్రావు, ధర్మకర్తలు గోలి రాజశేఖర్ సిబ్బంది పాల్గొన్నారు.
స్టూడెంట్ డైరీ ఆవిష్కరణ
జఫర్గఢ్: మండల పరిధి తిడుగు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉపాధ్యాయ బృందం రూపొందించిన స్టూడెంట్ డైరీని కలెక్టర్ రిజ్వాన్ బాషా శుక్రవారం తన కార్యాలయంలో డీఈఓ భోజన్నతో కలిసి శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల విద్యాభివృద్ధికి డైరీ ఎంతగానో దోహదపడుతుందని, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధతో డైరీని రూపొందించడం అభినందనీయమని అన్నారు. డీఈఓ భోజన్న మాట్లాడుతూ పిల్లల విద్యా ప్రగతిని తల్లిదండ్రులు తెలుసుకోవడంతో పాటు విద్యార్థులు క్రమశిక్షణ, సమయపాలన పాటించేందుకు డైరీ ఉపయోగపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో టీఆర్టీ జిల్లా అధ్యక్షుడు కొల్ల మహిపాల్రెడ్డి, హెచ్ఎం సదానందం, ఉపాధ్యాయులు నవీన్రెడ్డి, శ్రవణ్కుమార్, రాజు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
దేవరుప్పుల : పేదరిక నిర్మూలనతోపాటు సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వాలు చేపట్టే సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ట్రైబల్ వెల్ఫేర్ అధికారి రూపాదేవి సూచించారు. శుక్రవారం లకావత్తండా(ఎం)లో మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యాన నిర్వహించిన ‘పీఎం ధర్తీ అభజన్ భగీధారి అభయాన్’ ప్రత్యేక గ్రామసభలో ఆమె మాట్లాడారు. కిసాన్ క్రెడిట్ కార్డ్, ఆయుష్మాన్ భారత్, వృద్ధ్ధాప్య పింఛన్లు, ఇన్సూరెన్స్ స్కీమ్స్, రేషన్ కార్డులు తదితర సంక్షేమ పథకాల వినియోగంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీఓ సురేష్కుమార్, మండల వైద్యాధికారి రవితేజ, ఏఈఓ సనా మహావీణ్, గ్రామ ప్రత్యేక అధికారి పి.మహేష్ పాల్గొన్నారు.
నాటి ‘ఎమర్జెన్సీ’ రోజులు గుర్తుకొస్తున్నాయి..
జనగామ రూరల్: ఇందిరాగాంధీ పాలనలో అమలు చేసిన ఎమర్జెన్సీ.. నాటి చీకటి రోజు లు గుర్తుకొస్తున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ అన్నారు. ఇందిరాగాంధీ ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం భారతీయ జనతా యువమోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యాన పట్టణంలోని నెహ్రూ పార్కు వద్ద నిర్వహించిన ‘సంవిధాన్ హత్య దివస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 1975లో నాటి కాంగ్రెస్ ప్రధాని ఇందిరాగాంధీ సొంత ప్రయోజనాల కోసం అంతర్గత కలహాలు అనే ఒక కుంటిసాకు చూపి ఎమర్జెన్సీ విధించి భారత పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాయడంతో పాటు పత్రికా స్వేచ్ఛను హరించి నిరంకుశ పాలన కొనసాగించిందన్నారు. అటల్ బిహారీ వాజేపేయి, ఎల్కే అద్వానీ, జయప్రకాశ్ నారాయణ జైలు జీవితం గడిపారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీకి అధికార కాంక్ష తప్ప ప్రజలపై చిత్తశుద్ధి ఏనాడూ లేదని, ఇప్పటికీ అదే ధోరణితో ప్రజల పట్ల వ్యవహరిస్తున్నదని విమర్శించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శివరాజు, ఉపాధ్యక్షులు దేవరాయ ఎల్లయ్య, డాక్టర్ భిక్షపతి, మహిపాల్, నవీన్, దడిగా రవి, ఉల్లెంగుల రాజు, కీర్తి వెంకటేష్, రఫ్తార్ సింగ్, అవినాష్, రంజిత్, రాజు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

వేంకటేశ్వరుడికి విశేష అలంకరణ

వేంకటేశ్వరుడికి విశేష అలంకరణ

వేంకటేశ్వరుడికి విశేష అలంకరణ