
నాణ్యమైన భోజనం అందించాలి
జగిత్యాల/మల్లాపూర్: పిల్లలకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని డీఈవో రాము అన్నారు. శుక్రవారం జిల్లాలోని పలు పాఠశాలల్లో సామూహిక అక్షరాభ్యాసం చేపట్టగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పలు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పనితీరును పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని ఆదేశించారు.
ప్రభుత్వ బడుల బలోపేతానికి కృషి చేయాలి
ప్రభుత్వ బడులల బలోపేతానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈవో రాము అన్నారు. శుక్రవారం మల్లాపూర్ మండలం హుస్సెన్నగర్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. అలాగే మండలంలోని మొగిలిపేట ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. సర్కార్ బడులపై విద్యార్థుల తల్లిదండ్రులకు భరోసా కల్పించేలా ఉపాధ్యాయుడు రాజేందర్ తన పిల్లలను పాఠశాలలో చేర్పించడం అభినందనీయమని కొనియాడారు. ప్రజల్లో నాటుకపోయిన అపోహాలను తొలగించేందుకు ఉపాధ్యాయులు తమ పిల్లలను తాము పనిచేసే చోటనే చేర్పించడం వంటి చర్యలు దోహదపడుతాయన్నారు. ఇటీవల ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ సాధించిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమాల్లో జిల్లా సెక్టోరియల్ అధికారి మహేశ్, ఎంఈవో దామెదర్రెడ్డి, హెచ్ఎంలు భాగ్యలక్ష్మి, శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.