2024–25 వానాకాలం సీజన్‌ సీఎమ్మార్‌(మెట్రిక్‌ టన్నుల్లో) | - | Sakshi
Sakshi News home page

2024–25 వానాకాలం సీజన్‌ సీఎమ్మార్‌(మెట్రిక్‌ టన్నుల్లో)

Jun 13 2025 5:27 AM | Updated on Jun 13 2025 5:27 AM

2024–25 వానాకాలం సీజన్‌ సీఎమ్మార్‌(మెట్రిక్‌ టన్నుల్లో)

2024–25 వానాకాలం సీజన్‌ సీఎమ్మార్‌(మెట్రిక్‌ టన్నుల్లో)

జిల్లా ఇచ్చిన ధాన్యం ఇవ్వాల్సినబియ్యం ఇచ్చింది శాతం పెద్దపల్లి 2,97,379 1,99,750 1,80,487 90 కరీంనగర్‌ 2,60,679 1,75,589 1,43,946 82 జగిత్యాల 3,08,271 2,08,277 1,19,642 57 సిరిసిల్ల 2,11,572 1,42,327 61,364 43

సాక్షి, పెద్దపల్లి: రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని కస్టమ్‌ మిల్లింగ్‌ (సీఎమ్మార్‌– మర ఆడించి) చేసి బియ్యంగా ఇవ్వడంలో ఇన్నాళ్లూ జాప్యం చేస్తూ వచ్చిన రైస్‌ మిల్లర్లు.. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో దిగొస్తున్నారు. సీఎమ్మార్‌పై ప్రత్యేకంగా దృష్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. గ్యారెంటీ బాండ్‌లు ఇచ్చిన వారికే ధాన్యం కేటాయింపులు చేస్తుండడంతో మిల్లర్లు దారికొస్తున్నారు. దీనికితోడు ప్రభుత్వం ఇటీవల సన్నబియాన్ని రేషన్‌ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తుండడంతో రీసైక్లింగ్‌ దందాకు చెక్‌పెట్టినట్లు అయ్యింది. దీంతో పెద్దపల్లి జిల్లా 90శాతంతో రాష్ట్రంలో రెండోస్థానంలో ఉండగా, కరీంనగర్‌ నాలుగో స్థానంలో నిలిచాయి. అయితే, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలు సీఎమ్మార్‌ డెలివరీ చేయడంలో వెనకబడ్డాయి.

బ్యాంక్‌ గ్యారెంటీ షరతు

కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తూ ప్రభుత్వం మిల్లర్లకు ఇస్తోంది. మిల్లర్లు ఒక క్వింటాల్‌ వడ్లు తీసుకుంటే 68 కిలోల బాయిల్డ్‌రైస్‌, 67 కిలోల రారైస్‌ ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో అవసరమైన రేషన్‌బియ్యం కోటా తీసుకొని మిగిలిన బియ్యాన్ని మిల్లర్లు ఎఫ్‌సీఐకి అప్పగించాలి. అయితే, ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని మిల్లర్లు ఇప్పటిదాకా తమ ఆర్థికాభివృద్ధికి వినియోగించుకునేవారు. బియ్యం అప్పగించకుండానే ధాన్యాన్ని విక్రయించి ఆ డబ్బతో వ్యాపారాలు నిర్వహించేవారు. రూ.కోట్ల విలువైన ధాన్యం రైస్‌మిల్లర్లుకు వరంగా మారినా అధికారులు పటిచుకోలేదన్న ఆరోపణలున్నాయి. దీంతోనే మిల్లర్లు సీఎమ్మార్‌ ఇవ్వడంలో జాప్యం చేసేవారు. ప్రస్తుతం టాస్క్‌ఫోర్స్‌, రెవెన్యూ, సివిల్‌ సప్లయీస్‌, పోలీసు శాఖలు సంయుక్తంగా తనిఖీలు చేపట్టడం, కేసులు నమోదు చేయడంతోపాటు ఆస్తుల జప్తుకూ వెనుకాడడం లేదు. దీంతోపాటు, సీమ్మార్‌ డిఫాల్ట్‌ను నివారించడానికి బాండ్‌లు ఇచ్చినవారికే ధాన్యం కేటాయింపులు చేశారు. సర్కారు ధాన్యాన్ని ఇప్పటికే విక్రయించిన మిల్లర్లు ఇప్పుడు బయట వడ్లు సేకరించి మరీ మిల్లింగ్‌ చేసి సర్కారుకు బియ్యం ఇస్తున్నారు. దీంతో సీఎమ్మార్‌ డెలివరీ వేగవంతమైంది.

రికార్డు నమోదు

రైస్‌మిల్లర్లకు ఇచ్చిన లక్ష్యం ప్రకారం సీఎమ్మార్‌ను త్వరగా పూర్తి చేయాలి. గత వానాకాలం మిల్లింగ్‌ను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసేలా తీసుకున్న చర్యలతో సీఎమ్మార్‌ను వేగంగా సేకరించగలిగాం. రాష్ట్రంలోనే పెద్దపల్లి జిల్లా రెండో స్థానంలో ఉంది.

– శ్రీకాంత్‌రెడ్డి, డీఏం,

జిల్లా పౌర సరఫరాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement