
ఆదర్శం ఈ ఉపాధ్యాయుడు● పనిచేస్తున్న పాఠశాలలోనే కుమారుడ
మల్లాపూర్: ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలంటూ ప్రచారం చేయడమే కాదు.. దానిని అనుసరించారు మండలంలోని మొగిలిపేట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు బబ్బురి రాజేందర్. ప్రభుత్వ పాఠశాలల్లో చదువు సరిగా చెప్పరనే దురాభిప్రాయాన్ని తొలగించేందుకు తన కుమారుడిని ఆయన పనిచేస్తున్న పాఠశాలలోనే గురువారం చేర్పించి ఆదర్శంగా నిలిచారు.
ధర్మపురి నుంచే మొక్కలు నాటుతాం
ధర్మపురి: ధర్మపురి నియోజకవర్గం నుంచే మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. ఇటీవల మరణించిన వనజీవి రామయ్యను ఆదర్శంగా తీసుకుని వాశ్విన్ ఫౌండేషన్ చైర్మన్ నిడిగొండ నరేష్ ఆధ్వర్యంలో ఏటా లక్ష మొక్కలు నాటాలని సంకల్పించారు. ఇందుల భాగంగా మంత్రి లక్ష్మణ్కుమార్ మొదట తన అధికారిక నివాసంలో మొదటి మొక్కను నాటారు.

ఆదర్శం ఈ ఉపాధ్యాయుడు● పనిచేస్తున్న పాఠశాలలోనే కుమారుడ