
బీర్పూర్లో తెరుచుకోని నాలుగు పాఠశాలలు
● ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన విద్యాశాఖ
సారంగాపూర్: బీర్పూర్ మండలంలోని నాలుగు పాఠశాలలు గురువారం పలు కారణాలతో తెరుచుకోలేదు. దీంతో మండల విద్యాశాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టిపెట్టింది. రంగసాగర్ ప్రాథమిక పాఠశాల గ్రామానికి దూరంగా ఉందంటూ అక్కడి విద్యార్థులు పాఠశాలకు వెళ్లడానికి ఆసక్తి చూపలేదు. దీంతో ఆ విద్యార్థులను ఆటోలో బీర్పూర్ ప్రాథమిక పాఠశాలకు తరలించారు. రంగసాగర్ ఉపాధ్యాయుడిని డిప్యూటేషన్పై రేకులపల్లి పాఠశాలకు పంపించారు. మంగేళ ఎస్సీ కాలనీ పాఠశాలకు ఉపాధ్యాయుడు లేకపోవడంతో అక్కడి విద్యార్థులను అదే గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలకు పంపించారు. తుంగూర్ కొత్తపేట పాఠశాలలో 15 మంది విద్యార్థులు ఉన్నా.. అక్కడ ఉపాధ్యాయుడు లేకపోవడంతో ప్రాథమిక పాఠశాలకు పంపించారు. ఈ స్కూల్లో ఆరుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. గంగసముద్రం పాఠశాల ఏడాదికాలంగా మూతపడడంతో గంగసముద్రం, సిరుపురం గ్రామాల విద్యార్థులను బీర్పూర్ ఎంపీపీఎస్ పాఠశాలకు తరలించామని ఎంఈవో నాగభూషణం తెలిపారు.