డబుల్‌బెడ్‌రూం లబ్ధిదారులకు వసతులు కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

డబుల్‌బెడ్‌రూం లబ్ధిదారులకు వసతులు కల్పించాలి

Jun 13 2025 5:27 AM | Updated on Jun 13 2025 5:27 AM

డబుల్‌బెడ్‌రూం లబ్ధిదారులకు వసతులు కల్పించాలి

డబుల్‌బెడ్‌రూం లబ్ధిదారులకు వసతులు కల్పించాలి

● జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌

జగిత్యాల: డబుల్‌బెడ్‌రూం లబ్ధిదారులకు వసతులు కల్పించాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ సత్యప్రసాద్‌తో కలిసి అధికారులతో సమావేశమయ్యారు. డ్రెయినేజీ, విద్యుత్‌, తాగునీరు ఏర్పాటు చేయాలన్నారు. స్కూల్‌ కమ్యునిటీ హాల్‌, అంగన్‌వాడీ కేంద్రం, హెల్త్‌ సెంటర్‌కు స్థలం గుర్తించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. అడిషనల్‌ కలెక్టర్‌ లత, ఆర్డీవో మధుసూదన్‌, మున్సిపల్‌ కమిషనర్‌ స్పందన, హౌసింగ్‌ డీఈ ప్రసాద్‌ పాల్గొన్నారు. ముందుగా 17వ వార్డులో చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. సీసీరోడ్లు, డ్రైనేజీలను నాణ్యతగా చేపట్టాలన్నారు. ఎమ్మెల్యేను డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల లబ్ధిదారులు కలిశారు. నూకపల్లి జ్ఞాన విజ్ఞాన సరస్వతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యేను సత్కరించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు వేణుగోపాల్‌రావు, దివాకర్‌రావు, సత్తయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement