లోకల్‌ కోర్టుల ద్వారా విద్యుత్‌ సమస్యలు పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

లోకల్‌ కోర్టుల ద్వారా విద్యుత్‌ సమస్యలు పరిష్కారం

Jun 12 2025 7:25 AM | Updated on Jun 12 2025 7:25 AM

లోకల్

లోకల్‌ కోర్టుల ద్వారా విద్యుత్‌ సమస్యలు పరిష్కారం

మెట్‌పల్లి: అపరిష్కృతంగా మిగిలిపోయిన విద్యుత్‌ సమస్యలకు లోకల్‌ కోర్టుల ద్వారా పరిష్కారం లభిస్తోందని రెండో సీజీఆర్‌ఎఫ్‌ నిజామాబాద్‌ లోకల్‌ కోర్టు చైర్మన్‌ నారాయణ అన్నారు. మెట్‌పల్లి పట్టణంలో బుధవారం లోకల్‌ కోర్టు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్‌ సమస్యలపై ఒక్క ఫిర్యాదు కూడా అందలేదని తెలిపిన ఆయన.. విద్యుత్‌ అధికారులు, సిబ్బంది మరింత మెరుగైన సేవలు అందించాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దన్నారు. విద్యుత్‌ ఆదా కోసం రైతులు కెపాసిటర్లు బిగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. సిబ్బంది సెల్‌ఫోన్‌ నంబర్లను గోడలపై రాయించాలని ఆదేశించారు. సీజీఆర్‌ఎఫ్‌ మెంబర్‌ టెక్నికల్‌ రామకృష్ణ, మెంబర్‌ ఫైనాన్స్‌ కిషన్‌, ఎస్‌ఈ సాలియానాయక్‌, మెట్‌పల్లి డీఈ గంగారాం, ఏడీఈలు మనోహర్‌, రఘుపతి, ఏఈలు రవి, ప్రదీప్‌, శివకుమార్‌, శ్రీనివాస్‌, అజయ్‌ పాల్గొన్నారు.

నేడు విద్యుత్‌ కట్‌ ప్రాంతాలు

జగిత్యాలజోన్‌: జిల్లాకేంద్రంలోని టౌన్‌–3 సెక్షన్‌ పరిధిలో గురువారం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేయనున్నట్లు ఎన్‌పీడీసీఎల్‌ డీఈ రాజిరెడ్డి తెలిపారు. గాంధీనగర్‌ 11 కేవీ విద్యుత్‌ ఫీడర్‌పై చెట్లకొమ్మలు తొలగించాల్సి ఉందని, తీన్‌ఖీని చౌరస్తా, పెద్ద మసీదు, కటికెవాడ, మంచినీళ్ల బావి, ఇస్లాంపుర, గాంధీనగర్‌, తెనుగువాడ, దగ్గులమ్మ గుడి, ఉస్మాన్‌పురా, మహబూబ్‌పుర, రహమత్‌పురా, జెండామహిళా, ప్యారాబాయ్‌, గోరేమియా, ఖిలాగడ్డ, తులసీనగర్‌ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా ఉండదని, వినియోగదారులు గమనించాలని సూచించారు.

తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలి

మల్యాల: ప్రతి ఒక్కరూ తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్‌ సూచించారు. మల్యాల మండలం నూకపల్లి అర్బన్‌ హౌసింగ్‌ కాలనీలో బుధవారం వైద్యశిబిరం నిర్వహించారు. టీబీ, హెచ్‌ఐవీ, డయాబెటిస్‌, బీపీ తదితర పరీక్షలు నిర్వహించి, మందులు అందించారు. వర్షాకాలంలో పారిశుధ్య నిర్వహణపై శ్రద్ధ వహించాలన్నారు. చెత్తాచెదారం, మురికినీరు నిల్వ లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్‌, వైద్యులు మౌనిక, సౌజన్య, ఎంఎల్‌హెచ్‌పీ సుష్మిత, ప్రకాశ్‌, రమేశ్‌, సాజిద్‌ పాల్గొన్నారు.

పాఠశాలల్లో సకల సౌకర్యాలు

జగిత్యాల: పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన వసతులు ఏర్పాటు చేశామని డీఈవో రాము అన్నారు. జగిత్యాలలోని పలు పాఠశాలలను బుధవారం పరిశీలించారు. వాష్‌రూమ్‌లు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకున్నామని, తాగునీటి వసతి కల్పించామని తెలిపారు. తొలిరోజే విద్యార్థులకు నోట్‌బుక్‌లు, టెక్ట్‌బుక్‌లు ఇస్తామన్నారు. మధ్యాహ్న భోజనంలో ఇబ్బంది లేకుండా చూస్తున్నామన్నారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు గ్రామసభలు, అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

ధర్మపురి: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని డీఈవో అన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా మండలంలోని కమలాపూర్‌, నక్కలపేట పాఠశాలలను సందర్శించారు. వసతులు, సౌకర్యాలు, డిజిటల్‌ బోధన, ఇంగ్లిష్‌ విద్యపై పిల్లలు, తల్లిదండ్రులకు వివరించారు. ఎంఈవో సీతామహాలక్ష్మి, ఉపాధ్యాయులు మ్యాన పవన్‌కుమార్‌, ఆసిఫ్‌, ప్రీతి, సంపూర్ణ తదితరులున్నారు.

లోకల్‌ కోర్టుల ద్వారా విద్యుత్‌ సమస్యలు పరిష్కారం1
1/2

లోకల్‌ కోర్టుల ద్వారా విద్యుత్‌ సమస్యలు పరిష్కారం

లోకల్‌ కోర్టుల ద్వారా విద్యుత్‌ సమస్యలు పరిష్కారం2
2/2

లోకల్‌ కోర్టుల ద్వారా విద్యుత్‌ సమస్యలు పరిష్కారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement