
భూములను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి
ఇబ్రహీంపట్నం: రైతులు భూములు కొన్న వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అడిషినల్ కలెక్టర్ లత అన్నారు. మండలంలోని వర్షకొండ, బర్థీపూర్ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. దరఖాస్తులు ఎలా స్వీకరిస్తున్నారు..? ఎన్ని వచ్చాయి..? పరిశీలించారు. భూములు కొన్నవారు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు వెనుకడుగు వేయొద్దన్నారు. రైతులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టా లేకుంటే పాత రికార్డులు పరిశీలించి.. పొరుగు ఉన్న రైతు వాగ్మూలంతో పట్టా చేస్తామన్నారు. విరాసత్ 30 రోజుల్లో పరిష్కరిస్తామని తెలిపారు. వ్యవసాయ భూమిలో ఇళ్లు, బడి అని రికార్డుల్లో పడిన రైతులు దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి వ్యవసాయ భూమిగా నమోదు చేస్తామన్నారు. ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్ వరప్రసాద్, డిప్యూటీ తహసీల్దార్ ప్రసాద్, ఆర్ఐలు రేవంత్రెడ్డి, రమేశ్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
అభివృద్ధి పనుల పరిశీలన
మెట్పల్లి: పట్టణంలోని 8,19వ వార్డుల్లో చేపడుతున్న పలు అభివృద్ధి పనులను అడిషనల్ కలెక్టర్ లత పరిశీలించారు. పనుల్లో నాణ్యత లోపించవద్దని సూచించారు. కమిషనర్ మోహన్, డీఈ నాగేశ్వర్రావు, ఏఈ తిరుపతి, శానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్ ఉన్నారు.