
మంచి విద్య
నిజాం కాలం నుంచి..
జగిత్యాల: జిల్లా కేంద్రం నడిబొడ్డున.. నిజాం కాలంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల (ఓల్డ్ హైస్కూల్) ఉమ్మడి జిల్లాలోనే ప్రథమ స్కూల్ అని చరిత్రకారులు చెబుతుంటారు. ఈ స్కూల్లో చదువుకున్న ఎంతోమంది గొప్పవారయ్యారు. రెండెకరాల స్థలంలో ఉన్న ఈ స్కూల్ ఇప్పటికీ కొనసాగుతోంది. 6 నుంచి 10వ తరగతి వరకు ఉన్న ఈ స్కూల్లో 350 మంది చదువుకుంటున్నారు. క్రమశిక్షణ గల స్కూల్గా పేరుగాంచింది. మాజీమంత్రులు జీవన్రెడ్డి, రాజేశంగౌడ్, ఎమ్మెల్సీ ఎల్.రమణ, ఎమ్మెల్యే సంజయ్కుమార్ తండ్రి హన్మంతరా వు, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రా వు, ఎంపీ సంతోష్, డాక్టర్ జగన్నాథరావు వంటి ఎందరో ఈ పాఠశాలలో చదువుకున్నారు.
ఈ పాఠశాలలో మంచి విద్య విద్యార్థులకు అందున్నాం. నిపుణులైన ఉపాధ్యాయులు ఉన్నారు. మంచి ల్యా బ్ విద్యార్థులకు మౌలి క వసతులు కలిగి ఉన్నాయి. పురాతనమైన ఈ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా నేను ఉండటం ఆనందంగా ఉంది. – ఆనందరావు, ఫిజికల్
సైన్స్ ఉపాధ్యాయుడు

మంచి విద్య