
సబ్సిడీ ఇవ్వాలి
మక్కలకు కనీసం 50 శాతం సబ్సిడీ ఇవ్వాలి. దీనివల్ల రైతులకు కొంతలో కొంత మేలు జరుగుతుంది. నేను ఐదు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తే.. విత్తనాల ఖర్చే రూ.10 వేలు అవుతోంది. సబ్సిడీ ఇస్తే నాలాంటి రైతులకు కొంత ఖర్చు తగ్గుతుంది.
– సత్యనారాయణ రెడ్డి, సారంగాపూర్
ఎలాంటి సబ్సిడీ లేదు
ప్రస్తుతం మొక్కజొన్న విత్తనాలపై ఎలాంటి సబ్సిడీ లేదు. ప్రభుత్వం తరుపున విత్తనాలు అందించడం లేదు. ప్రైవేట్ కంపెనీలు ఓపెన్ మార్కెట్లో మొక్కజొన్న విత్తనాలు అమ్ముకుంటున్నాయి. నమ్మకమైన, నాణ్యమైన సంస్థ నుంచి విత్తనాలు కొనుగోలు చేయాలని రైతులకు సూచిస్తున్నాం. లేకుంటే రైతులు నష్టపోయే ప్రమాదముంది.
– భాస్కర్, జిల్లా వ్యవసాయాధికారి

సబ్సిడీ ఇవ్వాలి