వార్డుల విభజన శాసీ్త్రయంగా చేయండి | - | Sakshi
Sakshi News home page

వార్డుల విభజన శాసీ్త్రయంగా చేయండి

Jun 10 2025 3:22 AM | Updated on Jun 10 2025 3:22 AM

వార్డుల విభజన శాసీ్త్రయంగా చేయండి

వార్డుల విభజన శాసీ్త్రయంగా చేయండి

జగిత్యాలటౌన్‌: జగిత్యాల బల్దియాలో వార్డుల పెంపు ప్రక్రియను శాసీ్త్రయంగా చేపట్టాలని మాజీమంత్రి జీవన్‌రెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం ఇందిరాభవన్‌ నుంచి కాంగ్రెస్‌ నాయకులతో కలిసి బల్దియా కార్యాలయానికి ర్యాలీగా వచ్చారు. బల్దియా కమిషనర్‌ స్పందనకు లేఖ అందించారు. 48 వార్డులున్న బల్దియాలో 50 వార్డులకు విస్తరించేందుకు ప్రభుత్వం నిర్ణయించిన క్రమంలో ముసాయిదా రూపకల్పనలో అధికారులు గందరగోళానికి తెరతీశారని పేర్కొన్నారు. నూకపల్లి అర్బన్‌ కాలనీని 49, 50 వార్డులుగా విభజిస్తే స్థానికులకు సౌకర్యాలు అందుతాయన్నారు. అర్బన్‌కాలనీలో ఇళ్లు కేటాయించిన 3500 కుటుంబాల సభ్యులు సుమారు ఏడు వేల మందిని 11వ వార్డులో చేర్చుతూ ముసాయిదా రూపొందించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన వెంట కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు కొత్త మోహన్‌, పీసీసీ కార్యదర్శి బండ శంకర్‌, మున్సిపల్‌ మాజీ చైర్మన్లు తాటిపర్తి విజయలక్ష్మి, జీఆర్‌ దేశాయ్‌, నాయకులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement