
మందులు అందుబాటులో ఉంచాలి
సారంగాపూర్: వర్షాకాలంలో వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలని, పీహెచ్సీలు, సీహెచ్సీల్లో వైరల్ ఫీవర్, డెంగీ వ్యాధులకు సంబంధించిన మందులు అందుబాటులో ఉంచుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. సారంగాపూర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపీ, ఇన్పేషెంట్లకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. ల్యాబ్ రికార్డులు, ఫార్మసీ వివరాలు పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యకేంద్రంలో కాలంచెల్లిన మందులుంటే వెంటనే తొలగించాలని ఆదేశించారు. వర్షాకాలం నేపథ్యంలో వైరల్ఫీవర్, డెంగీ వ్యాధుల మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అనంతరం రంగపేట, బీర్పూర్ మండలం నర్సింహులపల్లె గ్రామంలో నిర్వహించిన భూభారతి సభలో పాల్గొని గ్రామసభలో వచ్చిన సాదాభైనామా, అసైన్మెంట్ భూముల అమ్మకాలు, కొనుగోళ్లు, విరాసత్ దరఖాస్తులను పరిశీలించారు. ప్రజలు అందించే ప్రతి దరఖాస్తును పరిష్కరించేలా చూస్తామని తెలిపారు. ఆర్డీవో మధుసూదన్, మాతాశిశు సంరక్షణాధికారి జయపాల్రెడ్డి, ఎంపీడీవో చౌడారపు గంగాధర్, ఎంపీవో సలీం, మండల వైద్యాధికారి రాధ, తహసీల్దార్లు వహీదొద్దీన్, సుజాత పాల్గొన్నారు.
తాత్కాలిక భవనాల పరిశీలన
కోరుట్ల రూరల్: కోరుట్లలో నవోదయ పాఠశాల ఏర్పాటుకు అనుమతులు మంజూరైన విషయం తెలిసిందే. పాఠశాల ఏర్పాటు చేసేందుకు కోరుట్లలోని మహిళా డిగ్రీ కళాశాల భవనాలను కలెక్టర్ బి.సత్యప్రసాద్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సరైన ఏర్పాట్ల కోసం చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆర్డీవో జీవాకర్రెడ్డి, తహసీల్దార్ కృష్ణ చైతన్య ఉన్నారు.
అభివృద్ధి పనులు పూర్తి చేయాలి
జగిత్యాల: గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో నిర్మిస్తున్న గ్రామపంచాయతీ భవనాలు, అంగన్వాడీస్కూళ్లు, టాయిలెట్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్లు, సబ్ సెంటర్ల పనులు వేగవంతం చేయాలన్నారు. డీఆర్డీవో రఘువరణ్, పంచాయతీరాజ్ ఈఈ లక్ష్మణ్రావు పాల్గొన్నారు.
డెంగీ, వైరల్ ఫీవర్లతో అప్రమత్తంగా ఉండాలి
కలెక్టర్ సత్యప్రసాద్
సారంగాపూర్ పీహెచ్సీ తనిఖీ