
పట్టణాల అభివృద్ధికి నిధులు
జగిత్యాల/రాయికల్: జగిత్యాల మున్సిపాలిటీకి రూ.70 కోట్లు, రాయికల్ బల్దియాకు రూ.15 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ కావడంతో పట్టణాల అభివృద్ధికి నాంది పలుకుతోంది. రాష్ట్రంలో పలు మున్సిపాలిటీలకు నిధులు కేటా యించారు. జగిత్యాలకు రూ.20 కోట్లతో పాటు స్పెషల్ గ్రాంట్ కింద మరో రూ.50 కోట్లు కేటా యించారు. ఎమ్మెల్యే సంజయ్కుమార్ ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిసి జగిత్యాల, రాయికల్ మున్సిపాలిటీల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు. దీంతో జగిత్యాలకు రూ.70 కోట్లు, రాయికల్కు సీడీఎంఏ నుంచి రూ.15 కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే సంజయ్కుమార్ తెలిపారు. రోడ్లు, మురికికాలువలు, డివైడర్లు, పార్క్లు, వసతుల కల్పన కోసం ఈ నిధులను వినియోగించనున్నట్లు పేర్కొన్నారు. దీని కోసం ప్రతిపాదనలు పంపించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గతంలో జగిత్యాల మున్సిపాలిటీలో మోతె, తిప్పన్నపేట, శంకులపల్లి, హస్నాబాద్, ధరూర్, గోవిందుపల్లి విలీనమయ్యాయి. తాజాగా నూకపల్లి డబుల్బెడ్రూం కాలనీని కలుపుతూ గెజిట్ విడుదల చేశారు. వాటి అభివృద్ధికి రూ.70 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
సీఎం రేవంత్రెడ్డికి ధన్యవాదాలు
జగిత్యాల, రాయికల్ మున్సిపాలిటీలకు ప్రభుత్వం నిధులు కేటాయించినందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఎమ్మెల్యే సంజయ్కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. గురువారం వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా లింగం చెరువు వద్ద మొక్కలు నాటారు. నియోజకవర్గ పరిధిలోని జగిత్యాల, రాయికల్ మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.85కోట్ల నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. విలీన గ్రామాల అభివృద్ధికి ఈ నిధులను వెచ్చించనున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలో త్వరలోనే అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి కృషిచేస్తున్నానని, తాగునీటి కోసం ప్రత్యేకంగా రూ.36 కోట్ల పనులు జరుగుతున్నాయన్నారు. మున్సిపల్ కమిషనర్ స్పందన, మాజీ కౌన్సిలర్ శ్రీలత, సత్యం పాల్గొన్నారు.
జగిత్యాల మున్సిపాలిటీకి రూ.70 కోట్లు
రాయికల్ బల్దియాకు రూ.15 కోట్లు మంజూరు