
‘గిరి’ గ్రామాలకు మహర్దశ
రాయికల్:(జగిత్యాల): కేంద్ర ప్రభుత్వం గిరిజన గ్రామాల అభివృద్ధికి పీవీటీజీ స్కీం తీసుకొచ్చింది. జిల్లాలోని రాయికల్ మండలం బోర్నపల్లి, దావన్పల్లి గ్రామాలను ఈ స్కీం కింద ఎంపిక చేసింది. ఈ గ్రామాలను ఐదేళ్లపాటు కేంద్ర ప్రభుత్వం దతత్త తీసుకొని, ప్రత్యేక నిధులు కేటాయించడంతో పాటు వసతుల కల్పనకు మొదటి ప్రాధాన్యం ఇవ్వనుంది. ఈ రెండు గ్రామాల్లో రాష్ట్రం నుంచి వచ్చే నిధులతో పాటు కేంద్రం నిధులతో మరింత అభివృద్ధికి అవకాశం ఉంటుంది.
ఈ నెల 15నుంచి ప్రత్యేక గ్రామసభలు
పీవీటీజీ స్కీం కింద ఎంపికై న బోర్నపల్లి, దావన్పల్లి గ్రామాల్లో కేంద్ర 15 శాఖల అధికారులు ఈ నెల 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ప్రత్యేకం గ్రామసభలు నిర్వహిస్తారు. అర్హులైన గిరిజనులకు పూర్తిస్థాయిలో ప్రభుత్వ పథకాలు వర్తించేలా నివేదిక తయారు చేసి కేంద్రానికి పంపిస్తారు. గ్రామంలో అంగన్వాడీకేంద్రాల్లో ఎంత మంది చిన్నారులు ఉన్నారు..? ఎందరికి ఆధార్కార్డులు, రేషన్కార్డులు, కిసాన్కార్డులు, జన్ధన్ అకౌంట్లు, కుల ధ్రువీకరణ పత్రాలు ఉన్నాయని ఆరా తీస్తారు. కేంద్రం నుంచి ఎంత మంది లబ్ధి పొందుతున్నారనే అంశాలు క్షుణ్ణంగా సేకరించి, నివేదిక తయారు చేయనున్నారు. జిల్లాలోని ఈ రెండు గ్రామాలకు కేంద్ర గిరిజన వ్యవహారాలశాఖ మంత్రి ద్వారా ఐదేళ్ల పాటు ప్రత్యేక నిధులు కేటాయిస్తారు. ఈ నిధులతో రోడ్లు, అంగన్వాడీ భవనాలు, ఆసుపత్రి భవనాలు, హాస్టళ్లు, తాగునీటి సౌకర్యం కల్పిస్తారు.
పీవీటీజీ స్కీంలో బోర్నపల్లి, దావన్పల్లి ఎంపిక
కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు
ఈనెల 15 నుంచి 30వరకు ప్రత్యేక గ్రామసభలు