
ఎస్సెస్సీ బోర్డు తప్పిదం.. విద్యార్థినికి అన్యాయం
రామగిరి(మంథని): ఎస్సెస్సీ బోర్డు అధికారుల తప్పిదంతో విద్యార్థినికి అన్యాయం జరిగింది. రామగిరి మండలం బేగంపేటకు చెందిన సిరిపురం వర్షిత సెంటినరికాలనీలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదివింది. వార్షిక పరీక్షల్లో 567 మార్కులు సాధించింది. చదువులో మొదటి స్థానంలో ఉండే వర్షిత తనకు వచ్చిన మార్కుల పట్ల సంతృప్తి చెందక బోర్డు అధికారులకు రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకుంది. బోర్డు ఆదేశాలతో మరోసారి పరిశీలించగా అసలు తప్పిదం బయటపడింది. పార్ట్–బీ పేపర్ కౌంట్ చేయలేదని గుర్తించి ఇప్పుడు 20 మార్కులు కలిపి మొత్తం 587 మార్కులుగా బోర్డు నుంచి మార్కుల మెమో అందజేశారు. రీ వెరిఫికేషన్లో 20 మార్కుల పెంపుతో వర్షిత జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానం సాధించింది. అధికారుల తప్పిదం వల్ల తమ బిడ్డకు తీవ్ర అన్యాయం జరిగిందని వెంటనే బోర్డు అధికారులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
రీ వెరిఫికేషన్లో 20 మార్కులు పెంపు