రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

Jun 4 2025 12:14 AM | Updated on Jun 4 2025 12:14 AM

రెవెన

రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

జగిత్యాలరూరల్‌: రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని జగిత్యాల ఆర్డీవో మధుసూదన్‌ అన్నారు. భూభారతి కార్యక్రమంలో భాగంగా జగిత్యాల రూరల్‌ మండలం చల్‌గల్‌ గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో 104 దరఖాస్తులు వచ్చాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భూ సమస్యలతో బాధపడుతున్న రైతులు రెవెన్యూ సదస్సుల్లో తమ దరఖాస్తులు ఇస్తే క్షేత్రస్థాయిలోనే వాటిని పరిశీలించి వారి వివరాలను భూభారతిలో పొందుపర్చడం జరుగుతుందన్నారు. జగిత్యాల రూరల్‌ తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఆర్‌ఐలు భూమయ్య, శంషోద్దీన్‌ పాల్గొన్నారు.

కుజదోష నివారణ పూజలు

ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆల య ప్రాంగణంలోని యాగశాలలో మంగళవా రం కుజదోష నివారణ పూజలు ఘనంగా నిర్వహించారు. కుటుంబ కలహాలు, వాస్తుదో షాలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు కుజదోష నివారణకు పూజలు చేశారు. అనంతరం స్వామివారలకు మొక్కులు చెల్లించుకున్నారు.

ప్రైవేట్‌ రంగంలో ఉద్యోగావకాశాలు

జగిత్యాలటౌన్‌: ఆదర్శ మారుతీ సుజుకి నెక్సా జగిత్యాలలో రెసిడెంట్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌, సీనియర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌ ఉద్యోగాలకు ఈనెల 6న ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి బింగి సత్యమ్మ మంగళవారం తెలిపారు. ఈ ఉద్యోగాలకు డిగ్రీ, బీటెక్‌, ఎంబీఏ, డిప్లొమా పూర్తి చేసినవారు అర్హులని, ఇంగ్లిష్‌ పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎంపికై న అభ్యర్థులు జగిత్యాల, మెట్‌పల్లిలో పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఆసక్తి, అర్హత గల నిరుద్యోగ యువతీయువకులు 6న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని రెండో అంతస్తులో రూం నంబర్‌ 218లోని జిల్లా ఉపాధి కార్యాలయంలో నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరుకావాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 63095 23434 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

అటవీ భూమి స్వాధీనం

సారంగాపూర్‌(జగిత్యాల): బీర్‌పూర్‌ మండలం రంగసాగర్‌ గ్రామ శివారుల్లోని అటవీప్రాంతంలో కొంత మంది అటవీశాఖకు చెందిన భూమిని ఆక్రమించి, సాగుచేస్తుండగా అటవీశాఖ అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. గ్రామానికి చెందిన కొంత మంది వ్యక్తులు అటవీభూమిని చదును చేసి అందులో మామిడి చెట్లను నాటుతుండగా సమాచారం తెలుసుకున్న అధికారులు అక్కడికి చేరుకుని మామిడి చెట్లను తొలగించి చదును చేసిన భూమిని స్వాధీనం చేసుకున్నారు. మరో వ్యక్తి అటవీభూమిలో షెడ్డు నిర్మించగా అధికారులు సిబ్బందితో కలిసి ధ్వంసం చేసి తొలగించారు. ఈ విషయంపై అటవీశాఖ ధర్మపురి రేంజర్‌ శ్రీనాథ్‌ మాట్లాడుతూ, ఇటీవల రంగసాగర్‌ గ్రామానికి చెందిన సాగర్‌ అటవీభూములను సాగుచేస్తే కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని, అటవీభూములను సాగుచేసినా, చదును చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని, చదును చేయడానికి వినియోగించే యంత్రాలను సీజ్‌ చేస్తామని తెలిపారు.

రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి1
1/2

రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి2
2/2

రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement