
పంటల విస్తీర్ణాన్ని బట్టి ఎరువులు అందజేయాలి
మెట్పల్లి(కోరుట్ల): పంటల విస్తీర్ణాన్ని బట్టి రైతులకు ఎరువులు అందజేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. పట్టణంలోని విశాల సహకార సంఘ కార్యాలయాన్ని మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాలకవర్గం, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రతీ రైతు ఆధార్ కార్డు, పాస్ పుస్తకం జిరాక్స్ కాపీలను తీసుకోవడంతో పాటు వారి వేసే పంట విస్తీర్ణాన్ని బట్టి మాత్రమే ఎరువులు అందజేయాలన్నారు. అలాగే పీవో మిషన్ ఆధారంగా విక్రయాలు జరపాలన్నారు. కలెక్టర్ వెంట సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్ శ్రీనివాస్, సీనియర్ ఇన్స్పెక్టర్ నిజాం ఉన్నారు.
భూసమస్యల పరిష్కారానికే భూభారతి..
మెట్పల్లిరూరల్/ఇబ్రహీంపట్నం: భూసమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం భూభారతి గ్రామసభలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మంగళవారం మెట్పల్లి మండలం పెద్దాపూర్, ఇబ్రహీంపట్నం మండలం ఫకీర్కొండాపూర్, ఎర్రాపూర్ గ్రామాల్లో భూ భారతి రెవెన్యూ సదస్సులను నిర్వహించగా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. అర్హులైన రైతులందరికీ న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. దరఖాస్తులను క్షుణంగా పరిశీలించాలని అ ధికారులకు సూచించారు. ఫకీర్కొండాపూర్ సదస్సులో 65 మంది, ఎర్రాపూర్లో 19 మంది రైతులు భూ సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తు చేసుకున్నారు. కార్యక్రమాల్లో ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్లు శ్రీనివాస్, వరప్రసాద్, డిప్యూటీ తహసీల్దార్ ప్రసాద్, ఆర్ఐలు కాంతయ్య, రమేశ్, రేవంత్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
● కలెక్టర్ సత్యప్రసాద్