
పట్టణానికి నలువైపులా మార్కెట్లు
జగిత్యాల: ప్రజల సౌకర్యార్థం పట్టణానికి నలువైపులా మార్కెట్లు ఏర్పాటు చేశామని, పట్టణాభివృద్ధికి పాటుపడతానని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. మంగళవారం పట్టణంలోని 2,18,17వ వార్డుల్లో రూ.20 లక్షలతో చేపట్టే బీటీరోడ్లకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎమ్మెల్యేగా గెలిపించినందుకు పట్టణాన్ని అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. సీఎం రేవంత్రెడ్డి సహకారంతో పట్టణాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్తానని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేనన్ని నిధులు జగిత్యాలకు మంజూరు చేయించడం జరిగిందన్నారు. అలాగే జిల్లా కేంద్రంలోని 13వ వార్డుకు చెందిన బోగ రాజేశ్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా రూ.2.50 లక్షల ఎల్వోసీని ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమాల్లో కమిషనర్ స్పందన, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జ్యోతి, మాజీ కౌన్సిలర్లు లత, నవీన్, గిరి నాగభూషణం, చెట్పల్లి సుధాకర్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే సంజయ్కుమార్