బడిబాట విజయవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

బడిబాట విజయవంతం చేయాలి

Jun 4 2025 12:14 AM | Updated on Jun 4 2025 12:14 AM

బడిబాట విజయవంతం చేయాలి

బడిబాట విజయవంతం చేయాలి

జగిత్యాల: జిల్లాలో ఈనెల 6 నుంచి 19 వరకు నిర్వహించే బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చే యాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి అన్నా రు. ఎస్సెస్సీలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మంగళవారం పొన్నాల గార్డెన్స్‌లో పీఆర్టీయూ జి ల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆనందరావు, యాళ్ల అమర్‌నాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రతిభ పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడు తూ, ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ బాధ్యత ఉపాధ్యాయులదేనని, ఈ సంవత్సరం బడిబాట కార్యక్రమంలో విద్యార్థుల సంఖ్య పెంచేలా చూడాలన్నారు. త్వరలోనే జిల్లా కేంద్రంలో డైట్‌ కాలేజీతో పాటు విద్యాధికారి పోస్టులు మంజూరవుతాయనిపేర్కొన్నారు. పీఆర్టీయూ నాయకులు గుండు లక్ష్మణ్‌, దామోదర్‌రెడ్డి, రాము, మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

బయాలజీ, ఫిజిక్స్‌ మార్కులు వేర్వేరుగా ఉండేలా చూడాలి

8,9,10వ తరగతుల బయాలజి, ఫిజిక్స్‌ సబ్జెక్ట్‌లకు 100 మార్కులు వేర్వేరుగా ఉండేలా చూ డాలని, 6,7వ తరగతుల్లో జీవశాస్త్రం, భౌతికశాస్త్రం అంశాలకు వేర్వేరు ఉపాధ్యాయులు ఉండేలా చూ డాలని ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డికి బయాలజికల్‌ సైన్స్‌ ఫోరం నాయకులు వినతిపత్రం అందజేశారు. రెండు వేరుగా లేకపోవడవంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. కార్యక్రమంలో బయాలజికల్‌ సై న్స్‌ ఫోరం జిల్లా అధ్యక్షుడు రాజ్‌గోపాల్‌, ప్రధాన కార్యదర్శి తిరుపతి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ఆ నందరావు, కార్యదర్శి అమర్‌నాథ్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement